Komatireddy Venkat Reddy : 65వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలనేది నా కల
- NH 65ను 6 లైన్లుగా విస్తరించాలనేది నా కల
- వాహనాల రద్దీపై ప్రభుత్వానికి GMR తప్పుడు లెక్కలు చెప్పింది
- జాతీయ రహదారి విస్తరణ తర్వాత నల్గొండ జిల్లాలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తాం : మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో నేడు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలవుతాయన్నారు. 65 వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్ లుగా విస్తరించాలనేది నాకల అని ఆయన వ్యాఖ్యానించారు. విస్తరణ తర్వాత యాక్సిడెంట్ ఫ్రీ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందని, మే నెలలో జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలై రెండు సంవత్సరాలలో పూర్తవుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వాహనాల రద్దీ విషయంలో GMR ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చెప్పిందన్నారు మంత్రి కోమటి రెడ్డి. GMR నేషనల్ హైవే అథారిటీతో చేసుకున్న అగ్రిమెంట్ ను ఉల్లంఘించిందన్నారు. నా పోరాటం వల్లే 65 వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ జరగబోతుందని, జాతీయ రహదారి విస్తరణ తర్వాత నల్లగొండ జిల్లాలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
Mohan Lal : ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న మోహన్ లాల్ బిగ్గెస్ట్ డిజాస్టర్
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
అంతేకాకుండా..’అర్వపల్లి జంక్షన్ లో ఫ్లైఓవర్ లేదు ప్రజలు ఆందోళనకు గురికావద్దు. ట్రిపుల్ ఆర్ పనులు మే నెలలో మొదలవుతాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయి.. హైదరాబాద్ రూపు రేఖలు మారిపోతాయి. త్రిబుల్ ఆర్ పూర్తి చేసేందుకు నేను, సీఎం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాం. కేటీఆర్ ను ధర్నాలు దీక్షలు, పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మరు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. నల్గొండ జిల్లా కేంద్రంలో రైతు ధర్నా చేసే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ చేసిన మోసం వల్లే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 50 వేలకు పైగా మెజారిటీ, ఎంపీలు దేశంలోనే రికార్డు మెజారిటీతో గెలిచారు. 10 సంవత్సరాలు పాలించి.. వందేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. త్వరలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని పార్టీలు తెర మరగయిపోతాయి.’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Trump On TikTok: అలా చేస్తేనే అమెరికాలో టిక్టాక్ సేవలను తిరిగి ప్రారంభిస్తాం..
తాజావార్తలు
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!