Kodanda Reddy : భూములు రికార్డుల ప్రక్షాళన పేరుతో అక్రమాలు జరిగాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇందిరా గాంధీ భూ సంస్కరణాల ద్వారా ఇచ్చిన భూములు కేసీఆర్ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగారెడ్డి, మెదక్, నల్గొండ లో ఆ భూములను చట్ట విరుద్ధంగా బిల్డర్స్ కి అప్పగిస్తున్నారని, బుద్వెల్ లో 282 ఎకరాలు దళితులకు భూ సంస్కరణల చట్టం కింద పంచారన్నారు. 1995 లో టీడీపీ హయాంలో అసైన్ భూమి అని ఆర్డివో నోటీసులు ఇచ్చారని, హైకోర్టు దళితులకు ఇచ్చిన భూములు లక్కోవడానికి లేదని 2008 కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ భూములు ఇప్పటి వరకు దళితుల చేతిలోనే ఉన్నాయన్నారు కోదండరెడ్డి. హెచ్ఎండీఏ వంద ఎకరాల వరకు ఈవేళం వేసిందని, 24 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉంటే 10 వేల ఎకరాల అసైన్ భూములను బిల్డర్స్ కి అప్పగించారన్నారు కోదండరెడ్డి. భూములు రికార్డుల ప్రక్షాళన పేరుతో అక్రమాలు జరిగాయని, భూములు అమ్మకంలో మొదటి నేరస్థుడు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అని ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : Exercise:వర్షాకాలంలో వాకింగ్ చేయడం కుదరడం లేదా? ఇంట్లోనే ఇలా ఎక్సర్సైజ్ చేసుకోండి
Also Read
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ధరణి లోపాల విషయంలో ప్రభుత్వంని వదలం.. న్యాయపోరాటం చేస్తామన్నారు. గ్రామాల్లోకి తిరగనివ్వమని, ఒక్కో గ్రామంలో దళితుల దగ్గర 9 లక్షలకు కొని 99 లక్షలకు అమ్ముకున్నారన్నారు కోదండరెడ్డి. ఇందిరా గాంధీ పంచిన భూములు పేదలకు అందేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, ఈ భూముల అమ్మకం చెల్లదని, యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ చట్టం తేవడానికి సర్వేలు చేయడానికి డబ్బులు కూడా కేటాయించిందన్నారు. నేను హుడా చైర్మన్ గా ఉన్నప్పుడు 5 అంతస్థుల పైన కట్టద్దు అని నిర్ణయం తీసుకున్నామని, 100 కోట్ల ఎకరానికి అమ్మిన భూమిలో ఎస్ఎఫ్ఐ లిమిట్ లేదు ఎన్ని అంతస్థులు అయినా కట్టుకోవచ్చన్నారు. ఫ్లైట్ పోయే మార్గంలో ఇలాంటి నిర్మాణలు ఉండద్దు అని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Lot Mobiles: లాట్ మొబైల్స్11వ వార్షికోత్సవ ఆఫర్లు.. అదిరిపోయే క్యాష్బ్యాక్ ఆఫర్
తాజావార్తలు
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!