Kodali Nani: దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు..
- తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా రాజకీయాల్లోకి లాగారు
- చంద్రబాబును దేవుడు క్షమించడు
- కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
Kodali Nani: తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబును దేవుడు క్షమించడన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని తెలిపారు. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో తాజాగా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. ఈ నెయ్యిని కూడా వాడలేదన్నారు. గతంలో కొన్ని వందలసార్లు ఇలానే నెయ్యిని వెనక్కి పంపటం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్ల వెనక్కి పంపడం జరిగిందన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారన్నారు.
Read Also: Perni Nani: తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు..
Also Read
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
- Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
జగన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు తిరుమలను రాజకీయాల్లోకి తీసుకు వచ్చారన్నారు. చంద్రబాబుకి బుద్ధి రావాలని, ప్రసాదంలో ఏ తప్పు జరుగలేదని భక్తులకు తెలియాలన్నారు. ఇప్పటి వరకు అలాంటివి జరగలేదన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేందుకు దిగజారారని విమర్శలు గుప్పించారు. రాజకీయాల కోసం స్వామిని చంద్రబాబు రోడ్డుకు ఈడ్చారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్నిసార్లు గుండు చేయించుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామిని మతాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ను ఎదుర్కోవాలంటే చంద్రబాబు డైరెక్ట్గా రావాలన్నారు. చంద్రబాబు, లోకేష్ సిట్ అంటే సిట్ అనే పోలీస్ ఆఫీసర్తో సిట్ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. మతాలను, కులాలను విచ్ఛిన్నం చేసే పెద్ద కుట్రగా తాము భావిస్తున్నామని.. దీనిపై ఎలాంటి ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నామని జగన్ ప్రధానికి, సుప్రీంకు లేఖలు రాశారన్నారు.
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!