Kodali Nani: దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు..
- తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా రాజకీయాల్లోకి లాగారు
- చంద్రబాబును దేవుడు క్షమించడు
- కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబును దేవుడు క్షమించడన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని తెలిపారు. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో తాజాగా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. ఈ నెయ్యిని కూడా వాడలేదన్నారు. గతంలో కొన్ని వందలసార్లు ఇలానే నెయ్యిని వెనక్కి పంపటం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్ల వెనక్కి పంపడం జరిగిందన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారన్నారు.
Read Also: Perni Nani: తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు..
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
జగన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు తిరుమలను రాజకీయాల్లోకి తీసుకు వచ్చారన్నారు. చంద్రబాబుకి బుద్ధి రావాలని, ప్రసాదంలో ఏ తప్పు జరుగలేదని భక్తులకు తెలియాలన్నారు. ఇప్పటి వరకు అలాంటివి జరగలేదన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేందుకు దిగజారారని విమర్శలు గుప్పించారు. రాజకీయాల కోసం స్వామిని చంద్రబాబు రోడ్డుకు ఈడ్చారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్నిసార్లు గుండు చేయించుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామిని మతాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ను ఎదుర్కోవాలంటే చంద్రబాబు డైరెక్ట్గా రావాలన్నారు. చంద్రబాబు, లోకేష్ సిట్ అంటే సిట్ అనే పోలీస్ ఆఫీసర్తో సిట్ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. మతాలను, కులాలను విచ్ఛిన్నం చేసే పెద్ద కుట్రగా తాము భావిస్తున్నామని.. దీనిపై ఎలాంటి ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నామని జగన్ ప్రధానికి, సుప్రీంకు లేఖలు రాశారన్నారు.
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?