సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా ఈరోజు(గురువారం) ఎంపిక చేశారు. డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు ఈ టూర్ జరగనుంది. ఈ టూర్ లో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో టీ20లు, వన్డే సిరీస్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అయితే, డిసెంబరు 26 నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్ లో ఆడనున్నట్లు తెలిపింది. ఇక.. టీ20ల్లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించగా.. వన్డేల్లో కెప్టెన్సీని కేఎల్ రాహుల్ కు అప్పగించింది. ఇదిలా ఉంటే.. రజత్ పాటిదార్, సాయి సుదర్శన్ లకు వన్డే జట్టులో తొలిసారి అవకాశం కల్పించారు. మరోవైపు.. టీ20ల్లో రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
ఇదిలా ఉంటే.. యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ ముఖేశ్ కుమార్ లను కూడా దక్షిణాఫ్రికా టూర్ కు సెలక్ట్ అయ్యారు. టీ20, వన్డేల్లో రవి బిష్ణోయ్, ముఖేశ్ కుమార్ కు స్థానం లభించింది. కాగా.. సీనియర్ బ్యాట్స్ మెన్ అజింక్యా రహానే, ఛటేశ్వర్ పుజారాలు లేకుండానే టెస్ట్ జట్టును ప్రకటించారు.
Brahmanandam: బ్రహ్మీతో అంత ఈజీ కాదు.. ఇచ్చి పడేశాడు
టీమిండియా వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, ముఖేశ్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చహర్.
టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.
టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, దీపక్ చహర్.