Kishan Reddy: చండూరు సభలో కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారు
Kishan Reddy Slams Cm Kcr Speech: చండూరు సభలో ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టు మాట్లాడారు. నిరాశ, నిస్పృహతో ముఖ్యమంత్రి మాట్లాడారు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే ఇప్పుడు మాట్లాడారు.. అవి నెరవేరితే ఎందుకు మళ్ళీ మాట్లాడటం. గత ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలనే గ్రామఫోన్ రికార్డు వేసినట్టు మళ్ళీ మాట్లాడారని విమర్శించారు. నలుగురిలో ముగ్గురు ఎమ్యెల్యేలు ఏ పార్టీలో గెలిచారో చెప్పాలి.. అక్రమంగా, దొడ్డి దారిన మీ పార్టీలో వారిని చేర్చుకుని నైతిక విలువలు గురించి మాట్లాడుతున్నారు..
మొయినా బాద్ సంఘటనలో FIR లో డబ్బులకు సంబంధించిన వివరాలు ఎందుకు పొందుపరచలేదు. ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రెస్ టీఆర్ఎస్..వైఎస్సార్ పార్టీ ఎమ్యెల్యే, ఎంపీని మీ పార్టీలో చేర్చుకోలేదా.? ఏ రకంగా కమ్యూనిస్ట్ నాయకులు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారు.? సీపీఎం ఎమ్యెల్యే ను కూడా చేర్చుకుని మీ పార్టీలో కలుపుకుని ఆ పార్టీ గొంతు నొక్కారు. 32 మంది ఎమ్యెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ ఎంపీ మల్లారెడ్డిని మీ పార్టీలో చేర్చుకున్నారు. కేసీఆర్ లో అభద్రతా భావం, అపనమ్మకం పెరిగింది.. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారన్నారు కిషన్ రెడ్డి.
Also Read
Read Also: KishanReddy Press Meet Live: కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
ఎన్నికల సభలో నలుగురు ఎమ్యెల్యేలను చూపించారు..వాళ్ళనెందుకు ప్రగతి భవన్ లో బంధించారు.. అన్ని అబద్దాలు కానీ, ఒక నిజం చెప్పారు.. దున్నపోతుకు గడ్డేసి.. అవుకు పాలు పిండితే వస్తాయా.? అట్లనే టీఆర్ఎస్ పార్టీ ఉంది.. తొమ్మిది ఏళ్లుగా చేయని అభివృద్ధి పదిహేను రోజుల్లో చేస్తానని చెప్తున్నారు. జీఎస్టీ లో చేనేత కార్మికులకు నలబై లక్షల లోపు టర్నోవర్ ఉంటే వారికి ఎటువంటి పన్ను ఉండదు.. జీఎస్టీ కౌన్సిల్ పన్ను నిర్ణయిస్తుంది..జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదు. వాజ్ పేయి ఫ్లోరైడ్ బాధితుల గురించి తెలుసుకున్న వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేసారు.. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నీరు గార్చింది.. కేసీఆర్ కు ఛాలెంజ్ చేస్తున్నా అన్నారు కిషన్ రెడ్డి. రూ.800కోట్లను ఫ్లోరైడ్ నివారణకు డబ్బులు ఇచ్చింది కేంద్రం. దమ్ము ధైర్యం ఉంటే దీన్ని నిరూపించండి. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు నువ్వెందుకు సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని కేసీఆర్ ని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Read Also: Prashant Kishor: ఆర్ఎస్ఎస్ కాఫీ అయితే బీజేపీ నురగలాంటిది.. దాన్ని దెబ్బతీయలేం..
మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన లేదు.. ఎక్కడ చెప్పలేదు. మీరు పెట్టాలనుకుంటే మేము అడ్డుకుంటాం..మీ అన్యాయాలపై మీటర్లు పెడతాం. మేము అధికారంలోకి వచ్చాక.. మీ అవినీతికి మీటర్లు పెట్టి కక్కిస్తాం.. ఊర్లలో బెల్టు షాపులు ఉన్నాయి.. కానీ అభివృద్ధి లేదు. 24గంటలు బెల్ట్ షాప్స్ నడుస్తున్నాయి.. ఊర్లకు రోడ్లు లేవు.. బస్సులు రావు కానీ.. బెల్ట్ షాప్స్ ఉన్నాయి. నువ్వు ప్రధాన మంత్రి అయితే దేశ వ్యాప్తంగా బెల్ట్ షాప్స్ పెడ్తావా.? సభకు విద్యాసంస్థల బస్సులను.. ఆర్టీసీ బస్సులను వాడుకుని వాటిలో మద్యం పంచుతుందన్నారు.
తెలంగాణ నీ ఒక్కడి వల్ల రాలేదు. కుటుంబానిదో, పార్టీదో కాదు. ఎల్లకాలం ఏలడానికి కాదు తెలంగాణ..రాచరిక రాజకీయాలకు తెలంగాణ ఘోరీ కట్టింది.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని.బిచ్చ గత్తెని చేసావన్నారు కిషన్ రెడ్డి.
- Tags
- 4mlas
- bandi sanjay
- BJP vs TRS
- cm kcr
- GST
తాజావార్తలు
-
Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
-
Tamil Nadu: విజయ్తో టచ్లోకి అన్నాడీఎంకే..
-
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
-
Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
-
MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్ను వీడనున్న హార్దిక్ పాండ్యా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!