Prashant Kishor: ఆర్ఎస్ఎస్ కాఫీ అయితే బీజేపీ నురగలాంటిది.. దాన్ని దెబ్బతీయలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Is Real Coffee, BJP Just The Froth Says Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ-ఆర్ఎస్ఎస్ బంధాన్ని కాఫీ కప్ తో పోల్చారు. ఆర్ఎస్ఎస్ కాఫీ అయితే.. దానిపై నురగలాంటిది బీజేపీ అని అన్నారు. బీహార్ రాష్ట్రంలో 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని లారియా వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ కాంగ్రెస్ పునరుద్ధరించడం ద్వారానే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని గ్రహించడానికి తనకు చాలా సమయం పట్టిందని.. నితీష్ కుమార్, జగన్మోహన్ రెడ్డికి పనిచేయడానికి బదులు నేను ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుండేదని పీకే అన్నారు.
నరేంద్ర మోదీని అడ్డుకోవడానికి ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి సమర్థతపై సందేహాన్ని వ్యక్తం చేశారు పీకే. బీజేపీ గురించి తెలియకపోతే ఓడించలేమని స్పష్టం చేశారు. కాఫీ కప్ లో నురగ బీజేపీ అయితే.. దాని కింద ఉంటే కాఫీ ఆర్ఎస్ఎస్ అని.. దాని నిర్మాణం చాలా లోతైనదని.. సంఘ్ సామాజిక వ్యవస్థలోకి ప్రవేశించిందని.. షార్ట్ కట్స్ తో దాన్ని కొట్టలేమని ఆయన అన్నారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
Read Also: Poonam Kaur: సోషల్ మీడియాలో రచ్చగా మారిన రాహుల్ గాంధీ-పూనమ్ కౌర్ ఫోటో
2014 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీకి ప్రశాంత్ కిషోర్ సహకరించారు. బీజేపీ సొంతంగా మెజారిటీలోకి రావడానికి ఆయన వ్యూహాలు సహాయపడ్డాయి. గతంలో జేడీయూ లీడర్ గా ఉన్న పీకే ప్రస్తుతం ఆ పార్టీ అధినేత, బీహర్ సీఎం నితీష్ కుమార్ ను బీజేపీ ఏజెంట్ అని విమర్శిస్తున్నారు. సీఏఏ-ఎన్ఆర్సీ సమయంలో నేను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నానని.. అయితే పార్లమెంట్ లో మాత్రం జేడీయూ ఎంపీలు పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో షాక్ అయ్యానని అన్నారు.
గతేడాది కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశం అయిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీలో చేరుతారని అనుకున్నారు. అయితే మహాత్మా గాంధీ నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ను ఇప్పటికీ ఆరాధిస్తున్నానని పీకే అన్నారు. గాంధీ కాంగ్రెస్ పునరుజ్జీవింపచేయడం ద్వారానే గాడ్సే భావజాలాన్ని ఓడించగలమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. గాంధీ హంతకుడు గాడ్సేకు ఆర్ఎస్ఎస్ తో సంబంధాలపై పరోక్షంగా వ్యాక్యలు చేశారు.
- Tags
- bjp
- congress
- JDU
- prashant kishor
- RSS
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!