Kishan Reddy: దేశం కోసం సిక్కులు చేసిన త్యాగం వెలకట్టలేనిది
- అమీర్పేటలోని గురుద్వారాలో వైశాఖీ ఉత్సవాలు
- నేడు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- సిక్కుల సేవలను కొనియాడిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం, ధర్మం కోసం త్యాగం చేసిన సమాజంగా సిక్కుల సమాజం గుర్తింపు పొందిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ఆదివారం బైశాఖి దినోత్సవం సందర్భంగా అమీర్ పేట్ లోని సిక్కు సోదరుల పవిత్ర ప్రార్థన మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనేక సంవత్సరాలుగా అమీర్ పేట్ లోని ఈ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటుందన్నారు. ప్రధాని మోడీ కూడా గతంలో ఈ గురుద్వారాను సందర్శించి తన భక్తిని చాటుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
READ MORE: Srinivasa Varma: నోరు మూసుకుని ఇంట్లో కూర్చో.. మాజీ మంత్రికి కేంద్ర మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
Also Read
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
కాగా.. అమీర్పేటలోని గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో వైశాఖీ (బైశాఖీ) ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో తొలిరోజు అమృత్ సంచార్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సిక్కు మత గురువులు(రాగి జత్తాస్) గుర్భాణీ కీర్తనలు ఆలపిస్తూ గురు గ్రంథాన్ని పఠిస్తూ అమృత్పాన్(పవిత్ర పానీయం)ను తయారు చేశారు. మత సంప్రదాయాలను పాటిస్తూ ఈ మతాన్ని అధికారికంగా అంగీకరించేందుకు ముందుకు వచ్చిన వారికి పానీయాన్ని అందజేశారు. హోలీ బాప్టిజంగా పేర్కొనే ఈ కార్యక్రమం ద్వారా సిక్కు యువత, పిల్లలు, మహిళలు అమృత పానీయాన్ని స్వీకరించారు. ఈ పానీయాన్ని తీసుకున్నవారు జీవితాంతం సిక్కు మత నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుందని గురువులు తెలిపారు. గురుద్వారాకు వచ్చిన భక్తులు, బాటసారులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గురుద్వారా సభ్యులు స్థానికులు షర్బత్, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. నేడు కిషన్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!