Kishan Reddy: దేశం కోసం సిక్కులు చేసిన త్యాగం వెలకట్టలేనిది
- అమీర్పేటలోని గురుద్వారాలో వైశాఖీ ఉత్సవాలు
- నేడు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- సిక్కుల సేవలను కొనియాడిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం, ధర్మం కోసం త్యాగం చేసిన సమాజంగా సిక్కుల సమాజం గుర్తింపు పొందిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ఆదివారం బైశాఖి దినోత్సవం సందర్భంగా అమీర్ పేట్ లోని సిక్కు సోదరుల పవిత్ర ప్రార్థన మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనేక సంవత్సరాలుగా అమీర్ పేట్ లోని ఈ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటుందన్నారు. ప్రధాని మోడీ కూడా గతంలో ఈ గురుద్వారాను సందర్శించి తన భక్తిని చాటుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
READ MORE: Srinivasa Varma: నోరు మూసుకుని ఇంట్లో కూర్చో.. మాజీ మంత్రికి కేంద్ర మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
Also Read
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
కాగా.. అమీర్పేటలోని గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో వైశాఖీ (బైశాఖీ) ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో తొలిరోజు అమృత్ సంచార్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సిక్కు మత గురువులు(రాగి జత్తాస్) గుర్భాణీ కీర్తనలు ఆలపిస్తూ గురు గ్రంథాన్ని పఠిస్తూ అమృత్పాన్(పవిత్ర పానీయం)ను తయారు చేశారు. మత సంప్రదాయాలను పాటిస్తూ ఈ మతాన్ని అధికారికంగా అంగీకరించేందుకు ముందుకు వచ్చిన వారికి పానీయాన్ని అందజేశారు. హోలీ బాప్టిజంగా పేర్కొనే ఈ కార్యక్రమం ద్వారా సిక్కు యువత, పిల్లలు, మహిళలు అమృత పానీయాన్ని స్వీకరించారు. ఈ పానీయాన్ని తీసుకున్నవారు జీవితాంతం సిక్కు మత నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుందని గురువులు తెలిపారు. గురుద్వారాకు వచ్చిన భక్తులు, బాటసారులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గురుద్వారా సభ్యులు స్థానికులు షర్బత్, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. నేడు కిషన్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజావార్తలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
-
Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!