Kishan Reddy: విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతమైన జాతీయ రహదాలను నిర్మించింది.. అలాగే రైల్వేను కూడా అభివృద్ధి చేస్తుందన్నారు. మరోవైపు.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు ప్రకటించిందని తెలిపారు. ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యంతో పాటు పేదవాడి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పేరుతో బీమా పథకాన్ని తీసుకొచ్చి ఏడాదికి ఐదు లక్షలు ఇస్తూ పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు మోడీ అని పేర్కొన్నారు.
CS Shanthi Kumari: ఇంటర్మీడియట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు..
Also Read
పాలమూరుకు భారతీయ జనతా పార్టీకి విడదీయరని అనుబంధం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో ఇక్కడ చేసిన పోరు యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీని, బీర్ఎస్ ను, టీడీపీని ఓడించి ప్రజలు బీజేపీని గెలిపించారని అన్నారు. పాలమూరు బిడ్డలను ఎప్పటికీ మరువమని ఆయన చెప్పారు. తెలంగాణ పోరు యాత్ర తర్వాత తిరిగి మరోసారి కృష్ణ గ్రామం నుండి కృష్ణమ్మ ఆశీస్సులతో మళ్లీ ఈ యాత్ర ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఐదు ప్రాంతాలలో యాత్రలు జరుగుతున్నాయి.. పెద్ద ఎత్తున ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు.. తిరిగి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
Ashok Chavan: అశోక్ చవాన్కు బెదిరింపు.. భద్రత పెంపు
మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని దేశంలోని అన్ని వర్గాలు ఆకాంక్షిస్తున్నాయని అన్నారు. ఈరోజు ఇంట్లో టాయిలెట్ నుండి మొదలుకొని చంద్రమండలంలోకి చంద్రయాన్ని పంపే వరకు మోడీ ప్రభుత్వ కృషి ఎంతో గొప్పది అని తెలిపారు. ఉచిత బియ్యం నుండి మొదలుకొని రైతులను ఆదుకునే వరకు మోడీ ప్రభుత్వం పనితీరు ఏంటో చెప్పకనే చెబుతుందని అన్నారు. దేశంలో ఉగ్రవాదులు మత కల్లోలాలు లేకుండా మోడీ ప్రభుత్వం చేసింది.. పాకిస్తాన్ ఐఏఎస్ ఉగ్రవాదుల తోకలు కత్తిరించారు మోడీ అని చెప్పారు. ఓ మూర్ఖుడు ధ్వంసం చేస్తే 500 ఏళ్లుగా గుడిసెలో ఉన్నాడు రాముడు.. కానీ మోడీ భవ్యమైన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి రాములవారిని ప్రతిష్టించారని తెలిపారు.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!