Kishan Reddy: విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతమైన జాతీయ రహదాలను నిర్మించింది.. అలాగే రైల్వేను కూడా అభివృద్ధి చేస్తుందన్నారు. మరోవైపు.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు ప్రకటించిందని తెలిపారు. ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యంతో పాటు పేదవాడి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పేరుతో బీమా పథకాన్ని తీసుకొచ్చి ఏడాదికి ఐదు లక్షలు ఇస్తూ పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు మోడీ అని పేర్కొన్నారు.
CS Shanthi Kumari: ఇంటర్మీడియట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
పాలమూరుకు భారతీయ జనతా పార్టీకి విడదీయరని అనుబంధం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో ఇక్కడ చేసిన పోరు యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీని, బీర్ఎస్ ను, టీడీపీని ఓడించి ప్రజలు బీజేపీని గెలిపించారని అన్నారు. పాలమూరు బిడ్డలను ఎప్పటికీ మరువమని ఆయన చెప్పారు. తెలంగాణ పోరు యాత్ర తర్వాత తిరిగి మరోసారి కృష్ణ గ్రామం నుండి కృష్ణమ్మ ఆశీస్సులతో మళ్లీ ఈ యాత్ర ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఐదు ప్రాంతాలలో యాత్రలు జరుగుతున్నాయి.. పెద్ద ఎత్తున ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు.. తిరిగి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
Ashok Chavan: అశోక్ చవాన్కు బెదిరింపు.. భద్రత పెంపు
మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని దేశంలోని అన్ని వర్గాలు ఆకాంక్షిస్తున్నాయని అన్నారు. ఈరోజు ఇంట్లో టాయిలెట్ నుండి మొదలుకొని చంద్రమండలంలోకి చంద్రయాన్ని పంపే వరకు మోడీ ప్రభుత్వ కృషి ఎంతో గొప్పది అని తెలిపారు. ఉచిత బియ్యం నుండి మొదలుకొని రైతులను ఆదుకునే వరకు మోడీ ప్రభుత్వం పనితీరు ఏంటో చెప్పకనే చెబుతుందని అన్నారు. దేశంలో ఉగ్రవాదులు మత కల్లోలాలు లేకుండా మోడీ ప్రభుత్వం చేసింది.. పాకిస్తాన్ ఐఏఎస్ ఉగ్రవాదుల తోకలు కత్తిరించారు మోడీ అని చెప్పారు. ఓ మూర్ఖుడు ధ్వంసం చేస్తే 500 ఏళ్లుగా గుడిసెలో ఉన్నాడు రాముడు.. కానీ మోడీ భవ్యమైన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి రాములవారిని ప్రతిష్టించారని తెలిపారు.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!