Kishan Reddy: కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండలేకపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండలేకపోతుందని ఆరోపించారు.
మేము మా కుటుంబం మాత్రమే దేశాన్ని పరిపాలించాలి అనే దుర్మార్గపు ఆలోచనతో సోనియా గాంధీ ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. రాహుల్ గాంధీ జోడో యాత్రను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. రాహుల్ గాంధీ చేసింది భారత్ జోడో యాత్ర కాదు తోడో యాత్ర అని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ యాత్ర చేసిన దగ్గర కాంగ్రెస్ నాయకులు పార్టీని వదిలి వెళ్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పాలనకు, బీజేపీకి నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా కనిపిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత..
Also Read
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
మోడీ పాలన ఎటువంటి విమర్శలు చేయడానికి కారణం లేకుండా ఉందని పేర్కొ్న్నారు. బీజేపీ ఎజెండా ఎంటో మేము చెప్పాలి కానీ కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారన్నారు. రిజర్వేషన్స్ ను రద్దు చేస్తున్నామని కాంగ్రెస్ అబద్దపు ప్రచారం చేస్తుందని.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనడానికి ఒక్క సాక్షం చూపించు రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న రిజర్వేషన్స్ రద్దు అనేది ఈ దశాబ్దంలోనే పెద్ద అబద్ధం అని కిషన్ రెడ్డి చెప్పారు.
Andhra Pradesh: తనిఖీల్లో.. 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం పట్టివేత
తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ప్రకటిస్తే.. అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని చేసిన ఘనత బీజేపీదని తెలిపారు. రాహుల్ గాంధీ ఆశలు నిరాశలు అయ్యాయి.. కాంగ్రెస్ కాళ్ల కింద భూమి కదులుతుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అనేక కల్పితాలు సృష్టించి.. కళ్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్దమైన అధికారాలు కల్పించి.. బీసీలకు గౌరవం పెంచామని కిషన్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చు.. లేకపోతే దిగిపో అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!