Kishan Reddy: రెండు కుటుంబ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్ భాగస్వామ్యం కాబోతుందని కేటీఆర్ అన్నారని.. కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. రెండు పార్టీల మధ్య మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తోందని తెలిపారు.
Viral Video: రోడ్డుపై తాచుపాము, ముంగిస హల్చల్.. వీడియో ఇదిగో..
Also Read
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
అంతేకాకుండా.. నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార అభ్యర్థి ఎన్నికల బాధ్యత కేసీఆర్ తీసుకున్నారని..
రెండు పార్టీల డీఎన్ఏ ఒకటిగా ఉందో, రెండు రోజుల ప్రకటనతో తేటతెల్లమైందని తెలిపారు. ఈ రెండు పార్టీలు ఒకే తానులో ముక్కలని స్పష్టమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఇటీవలే శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.., మజ్లిస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పారని.. పచ్చి మతవాద పార్టీ అయిన మజ్లిస్ ఏ రకంగా సెక్యులర్ పార్టీనో చెప్పాలని కిషన్ రెడ్డి తెలిపారు.
Tooth Pain: పంటి నొప్పి ఇబ్బంది పెడుతుందా?.. ఇలా చేస్తే క్షణాల్లో నొప్పి మాయం..
మూడు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేసినా, బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని తెలిపారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేసినా మజ్లిస్ పార్టీకి జై కొట్టినట్లేనని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీలను తెలంగాణ సమాజం అర్ధం చేసుకుని, బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీల మాటలకు ప్రజలు మోసపోరాదని విజ్ఞప్తి చేశారు. రెండు కుటుంబ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం.. సీఎంకు 40కి పైగా ఉత్తరాలు రాశానని.. ఏ ఒక్క ఉత్తరానికి సమాధానం ఇవ్వని కేసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని కిషన్ రెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!