Kishan Reddy: రెండు కుటుంబ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్ భాగస్వామ్యం కాబోతుందని కేటీఆర్ అన్నారని.. కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. రెండు పార్టీల మధ్య మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తోందని తెలిపారు.
Viral Video: రోడ్డుపై తాచుపాము, ముంగిస హల్చల్.. వీడియో ఇదిగో..
Also Read
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
- PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
- Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
అంతేకాకుండా.. నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార అభ్యర్థి ఎన్నికల బాధ్యత కేసీఆర్ తీసుకున్నారని..
రెండు పార్టీల డీఎన్ఏ ఒకటిగా ఉందో, రెండు రోజుల ప్రకటనతో తేటతెల్లమైందని తెలిపారు. ఈ రెండు పార్టీలు ఒకే తానులో ముక్కలని స్పష్టమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఇటీవలే శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.., మజ్లిస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పారని.. పచ్చి మతవాద పార్టీ అయిన మజ్లిస్ ఏ రకంగా సెక్యులర్ పార్టీనో చెప్పాలని కిషన్ రెడ్డి తెలిపారు.
Tooth Pain: పంటి నొప్పి ఇబ్బంది పెడుతుందా?.. ఇలా చేస్తే క్షణాల్లో నొప్పి మాయం..
మూడు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేసినా, బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని తెలిపారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేసినా మజ్లిస్ పార్టీకి జై కొట్టినట్లేనని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీలను తెలంగాణ సమాజం అర్ధం చేసుకుని, బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీల మాటలకు ప్రజలు మోసపోరాదని విజ్ఞప్తి చేశారు. రెండు కుటుంబ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం.. సీఎంకు 40కి పైగా ఉత్తరాలు రాశానని.. ఏ ఒక్క ఉత్తరానికి సమాధానం ఇవ్వని కేసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని కిషన్ రెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!