Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Fires On Brs Cheif Kcr

Kishan Reddy : 1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్‌ను వాజ్‌పేయి ప్రవేశ పెట్టారు

Published Date :January 29, 2024 , 5:41 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : 1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్‌ను వాజ్‌పేయి ప్రవేశ పెట్టారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీ మహిళ స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓస్ సంపర్క్ అభియాన్ ఆధ్వర్యంలో హయత్ నగర్ లోని ఓ హాల్ లో నిర్వహించిన కార్యశాల కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్ ను వాజ్‌పేయి ప్రవేశ పెట్టారన్నారు. ఇప్పుడు వేలాది స్వయం సహాయక సంఘాల ఏర్పడ్డాయని, ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసినా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కిషన్‌ రెడ్డి. ఈ సంఘాలకు ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వమన్నారు. బ్యాంకులు కూడా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా ‌సమయంలో ఆర్థిక సాయం పై మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు కిషన్‌ రెడ్డి. ఎలాంటి డిఫాల్ట్ లేకుండా రుణాలు కడితే వారికి 20లక్షల రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని, రుణాల పై 7శాతం రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు. కాని ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ వడ్డీ చెల్లించలేదని ఆయన మండిపడ్డారు. స్వయం సహాయక సంఘాల ఉంటే ఆ ప్రాంతంలో సమస్యలపై మాట్లాడుతారు.. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, స్వయం సహాయక సంఘాల ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు కిషన్‌ రెడ్డి. స్వయం సహాయక సంఘాలు ఒక పెద్ద శక్తి అని, ఎన్నికలు, రాజకీయాలు పక్కన పెట్టి స్వయం సహాయక సంఘాల పై దృష్టి సారించాలన్నారు.

అంతేకాకుండా.. ‘మూడున్నర కోట్ల ఇండ్లు పేద మహిళలకు ఇచ్చారు. ఎన్ని గ్యాస్ కనెక్షన్లు అయినా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. ప్రతి ఏటా ఒక మహిళ కు స్టాండప్ కింద పది లక్షల నుంచి 10కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని నిబంధనల పెట్టాం. మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చిన వ్యక్తి ప్రధాని మోడీ. మహిళల సైనికులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత లో కూడా దేశ రక్షణ కోసం బార్డర్ లో పని చేస్తున్నారు. పాకిస్థాన్ లో జరిగిన ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ లో మహిళా పైలెట్ పాల్గొన్నది. మహిళా స్వయం సహాయక సంఘాల వద్దకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పథకాలు వివరించాలి. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం. గతం లో తెలంగాణా లో ఏప్రిల్ 14న ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల కు వారం రోజుల అటూ ఇటూగా ఎన్నికలు జరగవచ్చు… అందరూ సిద్దం గా ఉండాలి. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి. ఆ కుంభకోణాలు ఉండకూడదు అనే బీజేపీ కి ప్రజలు పట్టం కట్టారు. ఎలాంటి అవినీతి లేకుండా మోడి పాలన సాగిస్తున్నారు. భారత్ లో కరోనా వస్తే తీవ్ర నష్టం జరుగుతుంది అని ప్రపంచం మొత్తం విశ్లేషకులు చెప్పేవారు. సమర్దవంతంగా కరోనాను మోదీ ఆధ్వర్యంలో ఎదుర్కోన్నాం.

సమర్దవంతమైన వ్యాక్సిన్ ను తయారు చేశాం. స్వయం గా ప్రధాని వచ్చి వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను సందర్శించి వారికి ధైర్యం ఇచ్చారు. మాస్క్ లు, పీపీఈ కిట్లు కూడా ఇన్పోర్ట్ చేసుకున్నాం. ఆ తరువాత ఇప్పుడు అన్ని మన దేశంలో తయారు చేసుకుంటున్నాం. మోడీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదు. ఏదో ఓ రకంగా మోడీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్చిన్నం అవుతుంది. ఈశాన్య రాష్ట్రాల లో కనీసం రోడ్లు కూడా ఉండేవి కావు. పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాష్ట్రంలో 32జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశాం. భారతీయులు అంటే గతంలో అవమానించే వారు.. ఇప్పుడు భారత పాస్పోర్ట్ ఉంటే పెద్దఎత్తున గౌరవం దక్కుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం లో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు జరిగేవి. ఇప్పుడు ఎక్కడా బాంబు పేలుళ్లు లేవు. 2023లో మొదటి సారి కాశ్మీర్ లో 2కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ఆర్టికల్ 370రద్దు చేసి శాంతి నెలకొల్పాం. గతం లో జమ్మూ కాశ్మీర్ లో జంగిల్ రాజ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ కుటుంబం అహంకారం తో సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. దేశం లో ఏ ఒక్క నాయకుడు అలా మాట్లాడరు.’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaing news
  • BRS
  • kcr
  • Kishan Reddy

తాజావార్తలు

  • B-1B Lancer: ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా B-1B లాన్సర్!

  • BAN vs PAK: పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో మరో వివాదం.. వైడ్ బాల్‌కి రివ్యూ, ఐసీసీకి ఫిర్యాదు!

  • Telangana Thalli Statue: అసెంబ్లీలో కొలువుదీరిన ‘తెలంగాణ తల్లి’.. ఆవిష్కరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

  • Oscars 2026 : ఆస్కార్స్ లో అదరగొట్టిన One Battle After Another.. ఏకంగా ఎన్ని అవార్డ్స్ గెలిచిందంటే

  • Metpally: హనుమాన్ మాలలో ఉన్న విద్యార్థులకు ప్రవేశం నిరాకరణ.. స్కూల్ వద్ద ఉద్రిక్తత..!

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions