Kishan Reddy : తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లాలో నేడు బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యిందన్నారు. వచ్చే 89 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, తెలంగాణ ప్రజల కోసం పని చేసే నాయకులు కావాలా ఓ కుటుంబం కోసం పని చేసే నాయకులు కావాలా ఆలోచించండని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కి వేస్తే కేసీఆర్ కుటుంబానికి ఓటు వేసినట్టు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కి ఓటేస్తే సోనియా గాంధీ కుటుంబానికి వేసినట్టు అని ఆయన అన్నారు. ప్రజల కోసం పని చేయాలంటే బీజేపీకి ఓటయ్యాలని, ఈ దేశంలో అత్యధిక ధనవంతమైన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన అన్నారు. అవినీతికి కొమ్ముకాసే పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. దేశంలో ఉన్న పార్టీల రాజకీయ ఖర్చులు నేను భరిస్తానని సీఎం కేసీఆర్ చెబుతున్నాడని ఆయన అన్నారు. ఈ డబ్బులన్ని ఎక్కడి నుంచి వచ్చాయి కేసీఆర్ అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Dil Raju: జవాన్ తో పాటు రిలీజైనా నిలదొక్కుకుంది.. ‘మిస్ శెట్టి’కి దిల్ రాజు ప్రశంసలు
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
అంతేకాకుండా.. ‘కేసీఆర్ సీఎం, కేటీఆర్ సీఎం అంటారు ఇదేమైనా నిజాం రాజ్యమా. కేసీఆర్ నయా నిజాం..మజ్లీస్ తో కలిసి దందా చేస్తున్నాడు. కేసీఆర్ కారులో కూర్చోవాలంటే ఆ స్టీరింగ్ మా చేతిలో ఉందని ఒవైసీ చెబుతున్నాడు. బీఆర్ఎస్కి ఓటేసిన కాంగ్రెస్ కి ఓటేసినట్టే..కాంగ్రెస్ కి ఓటేసిన అది బీఆర్ఎస్కి ఓటేసినట్టే. ఈ రెండు పార్టీలకు ఓటేస్తే మజ్లీస్ పార్టీకి ఓటేసినట్టే. ఈ మూడు పార్టీలు ఒక్కటే.. ఈ రెండు పార్టీల నాయకులు మజ్లీస్ పార్టీ ముందు జీ హుజూర్ అంటూ సలాం కొడుతారు. కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశాడు. ORR రోడ్డు 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చి జీతాలు ఇస్తున్నారు.
Also Read : Sana Mir: అచ్చం రష్మికలానే ఉంది.. ఈమే ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
మద్యం షాపు టెండర్ల ద్వారా వచ్చిన డబ్బులతో ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. మరొక్కసారి కేసీఆర్ కి అధికారం ఇస్తే చిప్ప చేతికి ఇస్తాడు కేసీఆర్. మిగులు బడ్జెట్ తెలంగాణ ని అప్పుల మయంగా మార్చారు. కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ని కాపాడుకోవాలి. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థికి పిలిచి భోజనం పెడతారు కేసీఆర్. కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచినా మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోతారు. రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటే. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. జనరంజకమైన పాలన అందిస్తాం.’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!