Kishan Reddy : దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావాలని, అందుకు నేతలంతా శ్రమించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, బీఆర్ఎస్ పై పోరాటానికి హైకమాండ్ కూడా పలు గైడ్ లైన్స్ ఇచ్చిందన్నారు కిషన్ రెడ్డి. వరంగల్ లో ప్రధాని మోడీ సైతం బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడారని, వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది బీఆర్ఎస్ పై పోరాటానికే అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Opposition Meeting: ఈ నెల 17-18న బెంగళూర్ వేదిక విపక్షాల భేటీ.. ఖర్గే ఆహ్వానం..
Also Read
కొన్ని టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలకు దిగుతున్నాయన్నారు. దీన్ని నేతలంతా ధీటుగా ఎదుర్కోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి చేసిందన్నారు కిషన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో ఉందని, వేల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ దోచుకుందని ఆయన ఆరోపించారు. ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నారని, ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
Also Read : Godavari River : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల అద్దం పడుతున్న గోదావరి
కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మ బొడుసులాంటి పార్టీలు అని, ఎన్నికలకు ముందో, తర్వాతో ఈ రెండూ కలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ.. దొందే అని, ఎవరికి ఓటేసినా కుటుంబ పార్టీకే ఓటు పడినట్లవుతుందన్నారు. ఈ రెండు పార్టీలకు అవినీతి చరిత్ర ఉందని, ఈ రెండూ కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఈ పార్టీలను ప్రజల వద్ద దోషిగా నిలబెట్టాలని, అనేక మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు కిషన్ రెడ్డి. గ్రామస్థాయి నుంచి చేరికలు జరగాలన్నారు. వచ్చే మూడు నెలలు సమగ్రంగా ప్రణాళిక చేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కిషన్రెడ్డి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!