Kishan Reddy : అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మోసం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లా ఔషాపూర్, ఘట్కేసర్లో జరిగిన బీజేపీ యువమోర్చ రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం.. అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మోసం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా.. రైతన్నలు, మహిళలు, కార్మికులు, నిరుద్యోగులు విషయంలో మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కనీసం పేదవాళ్లకు డబుల్బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేని పరిస్థితులో, దళితులకు, గిరిజనులకు మూడెకరాలు ఇవ్వలేని పరిస్థితిలో, విద్య, వైద్యం దెబ్బతిన్న పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : Jr NTR: ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్..
Also Read
అందుకే ఈ నెల 13, 14 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద, రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యపై దీక్ష చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరితో ఇబ్బంది పడుతున్న నిరుద్యోగ యువత దీక్షకు రావాల్సిందిగా కోరుతున్నానన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో 17 ఉదయం 8 గంటల నుంచి అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. పారామిలటరీ కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్ లిబరేషన్ డే సెలబ్రేషన్స్ ఉంటాయని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున నేను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Crime News: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. పెట్రోల్ పోసుకుని ప్రియుడు సూసైడ్
- Tags
- big news
- bjp
- breaking news
- BRS
- cm kcr
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!