Kishan Reddy : అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మోసం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లా ఔషాపూర్, ఘట్కేసర్లో జరిగిన బీజేపీ యువమోర్చ రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం.. అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మోసం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా.. రైతన్నలు, మహిళలు, కార్మికులు, నిరుద్యోగులు విషయంలో మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కనీసం పేదవాళ్లకు డబుల్బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేని పరిస్థితులో, దళితులకు, గిరిజనులకు మూడెకరాలు ఇవ్వలేని పరిస్థితిలో, విద్య, వైద్యం దెబ్బతిన్న పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : Jr NTR: ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్..
Also Read
అందుకే ఈ నెల 13, 14 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద, రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యపై దీక్ష చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరితో ఇబ్బంది పడుతున్న నిరుద్యోగ యువత దీక్షకు రావాల్సిందిగా కోరుతున్నానన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో 17 ఉదయం 8 గంటల నుంచి అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. పారామిలటరీ కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్ లిబరేషన్ డే సెలబ్రేషన్స్ ఉంటాయని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున నేను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Crime News: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. పెట్రోల్ పోసుకుని ప్రియుడు సూసైడ్
- Tags
- big news
- bjp
- breaking news
- BRS
- cm kcr
తాజావార్తలు
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
ట్రెండింగ్
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?