Kishan Reddy : బీఆర్ఎస్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేయబోయే బహిరంగ సభను దిగ్విజయవంతం చేయాలని కోరారు. అందులో భాగంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల నేతలతో జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి ప్రసంగించారు.
Also Read : CM Jagan Mohan Reddy: జగనన్న సంక్షేమ క్యాలెండర్ 2023-24 విడుదల
Also Read
- Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
- Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Metro Express: కరీంనగర్లో 'సిటీ మెట్రో ఎక్స్ప్రెస్' బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
అంతేకాకుండా.. ‘ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్నారు. తిరుపతికి వందే భారత్ రైలు, ఎయిమ్స్ భవన నిర్మాణంసహా పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నం. ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరపండి. కార్యకర్తలను, ప్రజలను తీసుకొచ్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసుకోండి. కనీవినీ ఎరగని రీతిలో సభను విజయవంతం చేయాలి. వేసవి కాలమైనందు సభ వద్ద తాగునీరు సహా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధాని పర్యటన, పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభపై మీడియా, సోషల్ మీడియాలో విస్త్రత ప్రచారం చేయాలి.
Also Read : Underwater Living: నీటి లోపల 100 రోజుల పాటు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం
హైదరాబాద్ నగరాన్ని పూర్తి స్థాయిలో అలంకరించాలి. మీ మీ డివిజన్లలో పూర్తిస్థాయిలో బహిరంగ సభపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. తెలంగాణ అభివ్రుద్ధికి కేంద్రం అనేక నిధులు కేటాయిస్తోంది. అనేక అభివ్రుద్ధి పనులు చేస్తోంది. 33 జిల్లాలకు గాను 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధించాం. త్వరలో పెద్ద పల్లి జిల్లాలో జాతీయ రహదారిని అనుసంధించే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. ఒక్క విషయం తెలుసుకోండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఇగ ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు. ఇది నా మాట కాదు… జేపీ నడ్డా గారే చెప్పారు.’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
-
Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
-
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
-
ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!