Kishan Reddy : బీఆర్ఎస్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేయబోయే బహిరంగ సభను దిగ్విజయవంతం చేయాలని కోరారు. అందులో భాగంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల నేతలతో జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి ప్రసంగించారు.
Also Read : CM Jagan Mohan Reddy: జగనన్న సంక్షేమ క్యాలెండర్ 2023-24 విడుదల
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
అంతేకాకుండా.. ‘ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్నారు. తిరుపతికి వందే భారత్ రైలు, ఎయిమ్స్ భవన నిర్మాణంసహా పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నం. ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరపండి. కార్యకర్తలను, ప్రజలను తీసుకొచ్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసుకోండి. కనీవినీ ఎరగని రీతిలో సభను విజయవంతం చేయాలి. వేసవి కాలమైనందు సభ వద్ద తాగునీరు సహా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధాని పర్యటన, పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభపై మీడియా, సోషల్ మీడియాలో విస్త్రత ప్రచారం చేయాలి.
Also Read : Underwater Living: నీటి లోపల 100 రోజుల పాటు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం
హైదరాబాద్ నగరాన్ని పూర్తి స్థాయిలో అలంకరించాలి. మీ మీ డివిజన్లలో పూర్తిస్థాయిలో బహిరంగ సభపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. తెలంగాణ అభివ్రుద్ధికి కేంద్రం అనేక నిధులు కేటాయిస్తోంది. అనేక అభివ్రుద్ధి పనులు చేస్తోంది. 33 జిల్లాలకు గాను 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధించాం. త్వరలో పెద్ద పల్లి జిల్లాలో జాతీయ రహదారిని అనుసంధించే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. ఒక్క విషయం తెలుసుకోండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఇగ ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు. ఇది నా మాట కాదు… జేపీ నడ్డా గారే చెప్పారు.’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!