Kishan Reddy : బీఆర్ఎస్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేయబోయే బహిరంగ సభను దిగ్విజయవంతం చేయాలని కోరారు. అందులో భాగంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల నేతలతో జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి ప్రసంగించారు.
Also Read : CM Jagan Mohan Reddy: జగనన్న సంక్షేమ క్యాలెండర్ 2023-24 విడుదల
Also Read
అంతేకాకుండా.. ‘ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్నారు. తిరుపతికి వందే భారత్ రైలు, ఎయిమ్స్ భవన నిర్మాణంసహా పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నం. ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరపండి. కార్యకర్తలను, ప్రజలను తీసుకొచ్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసుకోండి. కనీవినీ ఎరగని రీతిలో సభను విజయవంతం చేయాలి. వేసవి కాలమైనందు సభ వద్ద తాగునీరు సహా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధాని పర్యటన, పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభపై మీడియా, సోషల్ మీడియాలో విస్త్రత ప్రచారం చేయాలి.
Also Read : Underwater Living: నీటి లోపల 100 రోజుల పాటు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం
హైదరాబాద్ నగరాన్ని పూర్తి స్థాయిలో అలంకరించాలి. మీ మీ డివిజన్లలో పూర్తిస్థాయిలో బహిరంగ సభపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. తెలంగాణ అభివ్రుద్ధికి కేంద్రం అనేక నిధులు కేటాయిస్తోంది. అనేక అభివ్రుద్ధి పనులు చేస్తోంది. 33 జిల్లాలకు గాను 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధించాం. త్వరలో పెద్ద పల్లి జిల్లాలో జాతీయ రహదారిని అనుసంధించే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. ఒక్క విషయం తెలుసుకోండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఇగ ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు. ఇది నా మాట కాదు… జేపీ నడ్డా గారే చెప్పారు.’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!