Underwater Living: నీటి లోపల 100 రోజుల పాటు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Underwater Living: మానవులంతా పుట్టినప్పటి నుంచి భూమిపైనే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక రోగాల బారిన పడుతున్నారు. అందుకే భూమిపై కాకుండా 100 రోజులు నీటిలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచన ఓ ప్రొఫెసర్కు వచ్చింది. దాన్ని ఆచరిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది ఆయన నమ్మకం. ఇంతకీ ఆ ప్రయోగం ఏమిటంటే.. 55 ఏళ్ల కళాశాల ప్రొఫెసర్, మాజీ నేవీ డైవర్ తన పరిశోధనలో భాగంగా 55 చదరపు మీటర్ల నీటి అడుగున ఉపరితలం నుంచి దాదాపు 30 అడుగుల దిగువన నివసిస్తున్నారు. ప్రొఫెసర్ జోసెఫ్ డిటూరి విపరీతమైన ఒత్తిడికి దీర్ఘకాలంగా గురికావడానికి మానవ శరీరం ఎలా స్పందిస్తుందో అధ్యయనం చేస్తున్నారు. 2014లో టెన్నెస్సీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు 73 రోజుల పాటు నీటిలో నివాసం ఉన్నారు. దానిని 100 రోజులకు పొడిగించాలని ప్రొఫెసర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. US నేవీ మాజీ డైవర్ ఫ్లోరిడాలోని కీ లార్గోలో ‘జూల్స్ అండర్ సీ లాడ్జ్’లో ఉన్న 100 చదరపు అడుగుల ఆవాసంలో నివసిస్తున్నాడు. జోసెఫె డిటూరి ఆరోగ్యం, ముఖ్యమైన పారామితులపై మనస్తత్వవేత్తలు, మానసిక వైద్యుల బృందం నిశితంగా గమనిస్తున్నందున మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రయోగం 30 రోజులకు పైగా పూర్తయింది. డిటూరి అనేక మానసిక సామాజిక, మానసిక, వైద్య పరీక్షలను పూర్తి చేయాల్సిన పరీక్షల శ్రేణిని అమలు చేయడానికి రెగ్యులర్ డైవ్ల ద్వారా అతని ఆరోగ్యాన్ని వైద్య బృందం డాక్యుమెంట్ చేస్తోంది.
అసలు ప్రయోగం ఏంటంటే..
జోసెఫ్ డిటూరి 28ఏళ్లపాటు అమెరికా నేవీలో పనిచేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో చదివారు. అక్కడే ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి మెదడుకు అయ్యే గాయాల గురించి పరిశోధనలు చేశారు. మిలటరీలో సైనికులకు బుల్లెట్లు, పదునైన ఆయుధాలు తగలడం వల్ల ఎక్కువగా ఇలాంటి గాయాలవుతుంటాయి. ఆ గాయాల నుంచి కోలుకోవడం దాదాపుగా అసాధ్యం అనే సర్వసాధారణం. అలాంటి వారి కోసం తన వంతుగా ఏదైనా పరిశోధన చేయాలని జోసెఫ్ డిటూరి నిర్ణయించుకున్నారు. హైపర్ బేరిక్ ప్రెజర్ గురించి అధ్యయనం చేశారు. మెదడు దెబ్బతిన్న వారి శరీరంలోకి స్వచ్ఛమైన ఆక్సిజన్ వెళ్లేలా ఈ చికిత్స చేయడం ద్వారా కాస్త మెరుగైన ఫలితాలు వస్తున్నాయని తెలుసుకున్నారు. ఈ క్రమంలో అధిక పీడనానికి గురయిన కణాలు ఐదు రోజుల్లోనే రెట్టింపు అవుతాయని ఆయనకు విశ్వాసం కలిగింది. అందువల్ల ఆయుర్దాయం పెరుగుతుందని, వృద్ధాప్య సంబంధమైన వ్యాధులు దరి చేరవనే నిర్ణయానికి వచ్చారు. అందుకే జోసెఫ్ 100 రోజులు నీటిలో నివసించే ప్రయోగానికి పూనుకున్నారు.
Also Read
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
Read Also: Bangladesh fire: బట్టల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది దుకాణాలు దగ్ధం
నీటిలో ఉండేందుకు అనువుగా 100 చదరపు అడుగుల వైశాల్యంతో ఆవాసాన్ని సిద్ధం చేశారు. దీన్ని భూమట్టానికి కింద నీటిలో 30 అడుగుల లోతులో… ‘జూల్స్ అండర్ సీ లాడ్జ్’లో ఉంచారు. కీలార్గోలో ఆ ప్రదేశం ఉంది. లాడ్జి లోపలికి నీరు ప్రవేశించకుండా నిరంతరం గాలిని పంప్ చేస్తారు. దాంతో భూమి ఉపరితలంపై కంటే లోపల 1.6రెట్లు పీడనం ఉంటుంది. నీటి లోపల ఉంటూనే జోసెఫ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ క్లాసులు బోధిస్తున్నారు. ఒక ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నారు. ఆ పరీక్షలు మానసిక, శారీకర సంబంధమైన మార్పులను తెలుసుకునేలా ఉంటాయి. రక్త ప్రసరణ, అల్ట్రాసౌండ్, ఎలక్ట్రో కార్డియోగ్రామ్స్, స్టెమ్ సెల్ పరీక్షల ద్వారా మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు. మార్చి నెల ప్రారంభంలో జోసెఫ్ లాడ్జ్లోకి వెళ్లారు. జూన్ 9 వరకు అక్కడే ఉండనున్నారు. ఇలా నీటి అడుగున జీవించే సాహసం 2014లోనూ జరిగింది. టెన్నెస్సీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు 73 రోజుల పాటు నీటిలో నివాసం ఉన్నారు.
ఈ అధ్యయనం మునుపటి అధ్యయనాల ఫలితాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పెరిగిన ఒత్తిడికి గురైన కణాలు ఐదు రోజులలో రెట్టింపు అవుతాయని సూచించింది. పెరిగిన పీడనం మానవులకు వారి దీర్ఘాయువును పెంచడానికి, వృద్ధాప్యంతో సంబంధం ఉన్న వ్యాధిని అదుపులో ఉంచడానికి అవకాశం ఉందని సూచిస్తుంది. మనుషులు జీవించడానికి కావాల్సినవన్నీ భూమిపై ఉన్నాయని.. కానీ మొండి వ్యాధులను నయం చేసే శక్తి సముద్రంలోని కొన్ని జీవుల్లో ఉందని ప్రొఫెసర్ జోసెఫ్ డిటూరి వెల్లడించారు. దాన్ని కనుక్కుంటే సరిపోతుందని ఆయన నమ్ముతున్నానన్నారు. దీని కోసం మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. మానవ శరీరం ఎక్కువ రోజులు నీటిలో ఉండలేదని.. ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ఈ ప్రయత్నమన్నారు. నీటిలోని పీడనం కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!