Kishan Reddy : రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రతిపక్షాల నోట మాట లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారని అన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, నిర్ణయాలను చెప్పారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రతిపక్షాల నోట మాట లేదని, అన్ని రంగాల్లో మోడి ప్రభుత్వం అద్భుతమయిన అభివృద్ధి సాధించిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రపతి ప్రసంగంలో రాజకీయ అంశాలు లేకుండా, అభివృద్ధి పైనే మాట్లాడారని, వివిధ శాఖలు సాధించిన అనేక అంశాలు, రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపర్చారన్నారు. దేశప్రజలకు స్పష్టమయిన సందేశం రాష్ట్రపతి ఇచ్చారని, తెలంగాణ లో ఈ రోజుతో గ్రామ పంచాయితీల ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగుస్తుందన్నారు. బీఆర్ఎస్ పంచాయితీ వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. గ్రామ పంచాయితీల నిధులు దారి మళ్లించారని, సర్పంచ్ ల పదవి కాలం ముగుస్తోంది.. ప్రభుత్వం ఎటువంటి స్పష్టమయిన నిర్ణయం తీసుకోలేదన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా..’స్పెషల్ ఆఫీసర్ల ద్వారా పంచాయితీ పాలనకు ప్లాన్ చేస్తే, సరైంది కాదు. రాజ్యాంగ విరుద్ధం. గ్రామ సర్పంచి లేక పోతే గ్రామ సభలు ఎలా పెడతారు. సంక్షేమ పథకాల ఎంపికకు ప్రమాదమ్.. లబ్దిదారుల ఎంపిక అగిపోనుంది. కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల కోడ్ కంటే ముందే ఆరు గ్యారంటిలను అమలు చెయ్యాలి. తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల కసరత్తు మొదలు పెట్టాం. పకడ్బందీ వ్యూహంతో బిజెపి పార్లమెంట్ ఎన్నికల్లో వెళ్లనుంది. తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుస్తాం. బీజేపీ ఎందరికో పద్మ అవార్డులు ఇచ్చింది.. వాళ్ళను పార్టీల్లో చేరాలని ఎక్కడ కోరలేదు. గౌరవించడం మా బాధ్యత. రాజకీయాలతో అవార్డులను ముడిపెట్టొద్దు.’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Virat Kohli: "నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు".. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
- Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
- Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్కు అర్హత..
తాజావార్తలు
-
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
Virat Kohli: “నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు”.. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
-
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
-
Vijay – Trisha : అన్ఫాలో చేసిన త్రిష.. విజయ్తో ఇక బ్రేకప్?
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!