Kishan Reddy : కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కక్కిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ శనివారం బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రేమ్ సింగ్ రాథోడ్ కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ గోషామహల్ టికెట్ ఆశించిన భంగపడ్డ ప్రేమ్ సింగ్.. కాసేపటికి క్రితమే బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. అయితే.. నాగార్జునసాగర్ కు చెందిన పలువురు నేతలు సైతం బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సీట్ల కోసం చేరుతుంటారు.. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని ఆయన అన్నారు. కానీ బీజేపీలో ప్రేమ్ సింగ్ రాథోడ్ ఏం ఆశించకుండా చేరుతున్నారన్నారు. తిరిగి ఆయన తన ఇంటికి చేరుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ఈనెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా.. ‘111 మంది అభ్యర్థులు బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. దీపావళి తర్వాత విస్తృత ప్రచారం చేస్తాం. అమిత్ షా, యోగి, రాజ్ నాథ్ సింగ్, హిమాంత బిశ్వ శర్మ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సీఎం షిండే, శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీపై అబద్ధపు ప్రచారం చేస్తోంది. మజ్లీస్, బీజేపీ ఒక్కటేనని అబద్ధాలు చెబుతున్నారు. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లీస్ తో కలవబోము. వాళ్ళతో లాభపడింది, పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే. మత కలహాలు చేసే పార్టీతో మేము కలిసేది లేదు. కేసీఆర్ ఒక భుజంపై అక్బరుద్దీన్, మరో భజంపై అసద్ ను పెట్టుకుని తిరుగుతున్నారు. కర్ణాటక ప్రజల నెత్తిన భస్మాసుర అస్త్రం పెట్టింది కాంగ్రెస్. ఐదేళ్ళలో చేయాల్సిన నష్టం 5 నెలల్లోనే జరిగిపోయింది. పదేళ్లుగా కాంగ్రెస్ నేతలకు అధికారం లేదు.. అవురావురుమంటున్నారు. వాళ్ళు అధికారంలోకి వస్తే అరాచకమే. సీఎం కేసీఆర్ రెండుచోట్ల, మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయం. కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కక్కిస్తాం. అవినీతి, కుట్ర, మోసపూరిత పార్టీల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. తెలంగాణలో కుటుంబ, అవినీతి, నియంతృత్వ చీకటి అలుముకుంది. డిసెంబర్ 3తో రాష్ట్రంలో కమ్ముకున్న ‘కారు'(బీఆర్ఎస్) చీకటిని, అధికారంలోకి వస్తామనుకుంటున్న ‘మసక'(కాంగ్రెస్) చీకటిని పారద్రోలాలి’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
- Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
- El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
తాజావార్తలు
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
-
Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!