Kishan Reddy : వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ వరంగల్, భూపాలపల్లి మోరంచపల్లిలో వరద ముంపు ప్రాంతాల్లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించారు. వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని పరిశీలించి పార్టీపరంగా నిత్యావసర సరకులు, దుప్పట్లు పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద జాతీయ విపత్తు నిధులు 914 కోట్ల వరకు ఉన్నాయన్నారు. 2021-22 సంవత్సరం వరకు 736 కోట్లు, 2022-23 లో 178 కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అయ్యాయన్నారు. ప్రస్తుతం 2023-24 సంవత్సరానికి సంబంధించిన 197 కోట్లు ఉన్నాయని, ఎల్ సి తీసుకువస్తే రాష్ట్రప్రభుత్వ అకౌంట్ లో జమ చేస్తామన్నారు. వర్షం వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నివేదిక పంపలేదని, మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వమే కేంద్ర బృందాలను పంపించిందన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Pakistan Blast: పాకిస్తాన్లో బాంబు పేలుడు.. 40 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
కేంద్ర బృందాలు రేపటి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తాయని, కేంద్ర బృందాలు సేకరించిన నివేదిక ప్రకారం కేంద్రం ఆదుకునే చర్యలు చేపడుతుందన్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు చేపట్టాలని, వరద బాధితులకు ప్రతి కుటుంబానికి నాలుగు లక్షలు ఇవ్వచ్చన్నారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో నాలుగు లక్షల సహాయంలో 75శాతం 3 లక్షలు కేంద్ర ప్రభుత్వానివేనని, వర్షం వరదలతో పంటలకు అపారం నష్టం వాటిల్లిందన్నారు కిషన్ రెడ్డి. 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంటల ఫసల్ బీమాను అమలు చేయడంలేదని, దీంతో రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
Also Read : Ram Charan: ఇండస్ట్రీకి మీరే నిజమైన గేమ్ ఛేంజర్.. చరణ్ ట్వీట్ వైరల్
2016 నుంచి 2020 వరకు పంటల బీమా పథకం ద్వారా రెండు వేలకోట్ల మేలు తెలంగాణ రైతులకు జరిగిందని, 2020 నుంచిని పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసిందన్నారు కిషన్ రెడ్డి. 2023లో ఇప్పటివరకు ఐదు లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాన పదివేలు ఇస్తామన్నారు కేసిఆర్, ఇప్పటివరకు ఇవ్వడం లేదన్నారు. ఇక నాలుగు నెలలు మాత్రమే ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పంటల పసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. వరద ముంపు ప్రాంతాల్లో బీజేపీ బృందాలు పర్యటించి నిత్యవసర సరుకులు, దుస్తులు పంపిణీ చేస్తున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రాజకీయాలు మాట్లాడదలచుకోలేదు, నష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి వచ్చామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
- Tags
- big news
- bjp
- breaking news
- BRS
- cm kcr
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!