Pakistan Blast: పాకిస్తాన్లో బాంబు పేలుడు.. 40 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Blast: పాకిస్థాన్లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఆదివారం (జూలై 30) భారీ పేలుడు సంభవించింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలోని బజౌర్ లో జరిగిన ఈ బాంబు పేలుడులో 40 మంది మరణించారు, 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) కార్మికుల సదస్సును లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. JUI-F సమావేశం లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సంఘటనా స్థలం నుండి ఆసుపత్రికి తరలిస్తున్నారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Read Also:7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరగనున్న డీఏ
At least 10 people died as a bomb #blast hit a political rally on Sunday afternoon in #Pakistan's northwest Bajaur district. Over 50 others were injured. pic.twitter.com/AOfqs0pbLU
— Our World (@MeetOurWorld) July 30, 2023
Read Also:Ram Charan: ఇండస్ట్రీకి మీరే నిజమైన గేమ్ ఛేంజర్.. చరణ్ ట్వీట్ వైరల్
పేలుడు తర్వాత వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అందులో బాంబు పేలుడు చూడవచ్చు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. సీనియర్ JUIF నాయకుడు హఫీజ్ హమ్దుల్లా పాకిస్తానీ న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ గాయపడిన వారికి అత్యవసర వైద్య చర్యలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత మంగళవారం, ఖైబర్ పఖ్తున్ఖ్వాలో నిర్మాణంలో ఉన్న మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది, ఇందులో ఒక పోలీసు అధికారి మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్లో ఉగ్రవాద ఘటనలు పెరిగిపోవడం గమనార్హం. ది డాన్ నివేదిక ప్రకారం, గత సంవత్సరం జూన్ 18, 2022 నుండి జూన్ 18, 2023 వరకు ఖైబర్ పఖ్తుంక్వాలో 15 ఆత్మాహుతి బాంబులతో సహా 665 తీవ్రవాద దాడులు జరిగాయి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!