North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
- 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల అమలు..
- నార్త్ కొరియా నుంచి తప్పించుకుని సౌత్ కొరియాకు..
- కిమ్ రాజ్యం నుంచి బయటపడిన ఓ కుటుంబం కథ..
North Korea: ఉత్తర కొరియా ఒక నిగూఢ దేశం. ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ దేశ ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. కిమ్ జాంగ్ ఉన్ రాజ్యంలో రూల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్వోన్నత నాయకుడిని ప్రశ్నిస్తే ఉరిశిక్షే గతి. ఇదే కాకుండా దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన పాటలు విన్నట్లు తెలిసినా, సినిమాలు చూసినట్లు తెలిసినా మరణమే శరణ్యం. ఇక దేశం విడిచి వెళ్లాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఆ వ్యక్తితో పాటు అతడి కుటుంబం కఠినమైన శిక్షల్ని ఎదుర్కోవాల్సిందే.
10 ఏళ్ల ప్లానింగ్..
Also Read
అలాంటి నిఘా ఉన్న కిమ్ రాజ్యం నుంచి ఒక కుటుంబం సాహసోపేతంగా తప్పించుకుంది. నార్త్ కొరియా నుంచి స్వేచ్ఛ పొందింది. ల్యాండ్ ద్వారా కాకుండా అత్యంత కఠినమైన సముద్ర మార్గం ద్వారా కుటుంబానికి చెందిన 9 మంది తప్పించుకోవడం సంచలనం. ఇది ఊరికే జరగలేదు. దీని వెనక 10 ఏళ్ల ప్రణాళిక దాగి ఉంది. ఈ ప్రణాళికను కేవలం రెండు గంటలు అమలు చేసి ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా చేరి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకున్నారు.
కిమ్ యి హ్యోక్ కుటుంబంలోని 9 మంది సురక్షితంగా నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకు చేరిన కథ చాలా ఇంట్రెస్టింగ్. ముందుగా కుటుంబంలో చిన్న కొడుకుగా ఉున్న కిమ్ యి హ్యోక్ ఉత్తర కొరియా తీర ప్రాంతానికి పని కోసం వెళ్లాడు. అతను కొన్నేళ్ల పాటు అక్కడే చేపల వేట నేర్చుకున్నాడు. పడవ మరమ్మతులు, వాతావరణం, సముద్ర మార్గాలు, కిమ్ సైనికులు గస్తీ కాచే విధానం, సముద్ర వాతావరణంపై పూర్తిగా పట్టు సాధించాడు. వివాదాస్పద సముద్ర సరిహద్దు నార్తర్న్ లిమిట్ లైన్ (NLL) సమీపంలో గస్తీ నమూనాలను అధ్యయనం చేయడానికి, నిఘాలోని లోపాలను గుర్తించడానికి ఆ కాలాన్ని ఉపయోగించుకున్నారు.
సాధారణ వ్యక్తిగా కనిపించేందుకు, సైనికులకు అనుమానం రాకుండా వారితో పరిచయాలు పెంచుకున్నాడు. అనేక సార్లు వారికి లంచాలు ఇచ్చాడు. ఇలా అనుమానం రాకుండా వ్యవహరించాడు. చైనా నుంచి అక్రమంగా తెచ్చిన టీవీ ద్వారా దక్షిణ కొరియా జీవన విధానంపై ఆశ పెంచుకున్న ఆ కుటుంబం, నార్త్ కొరియా నరక కూపం నుంచి బయటపడాలని భావించింది.
2 గంటల గ్రేట్ ఎస్కేప్:
2023లో మేలో కిమ్ ఇల్ హ్యోక్ భార్య గర్భిణిగా ఉన్న సమయంలో తన ప్లాన్ అమలు చేసింది ఆ కుటుంబం. భారీ వర్షం పడుతున్న సమయంలో రాత్రి వేళ దేశం దాటాలని భావించింది. ఇందుకు వారు అత్యంత కఠిన పరిస్థితులు ఉన్న ఎల్లో సీ మార్గాన్ని ఎంచుకున్నారు. చేపల వేటకు వెళ్తున్నామని అనుమతి తీసుకుని ప్లాన్ అమలు చేశారు. కుటుంబంలోని మహిళల్ని ముందుగా రహస్యంగా తీరానికి తీసుకువచ్చారు. పిల్లల్ని సంచుల్లో దాచారు. మొత్తం కుటుంబం పడవ ఎక్కింది. రాత్రి సమయంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో ఉత్తర కొరియా సైన్యానికి దొరికితే మరణమే గతి. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో 2 గంటల పాటు సముద్రంలో ప్రయాణించి ఉత్తర కొరియా సరిహద్దుల్ని దాటారు. యోన్ప్యోంగ్ ద్వీపం కనిపించిందని, ఆ తర్వాత తమ సెర్చ్ లైట్ వేయడంతో దక్షిణ కొరియా నేవీ తమను రక్షించిందని చెప్పారు. దక్షిణ కొరియా ప్రకరాం.. ఇప్పటి వరకు 35 వేల మంది ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చారు. ఇలా పారిపోయి వచ్చినవారిలో ఎక్కువ మంది మహిళలే.
తాజావార్తలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!