Tummala Nageswara Rao : న్యాయం కోసం తప్పా నేను దేనికి లొంగను
- పాత రుణ మాఫీ చేశాం
- గతంలో ఏమైంది అంటే రైతు బంధు పేరుతో అన్ని పథకాలు ఆపేశారు
- అన్నింటి మీద కూడా వ్యవసాయ రంగంలో బాకీలు ఉన్నాయి : మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao : వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు రైతుల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచాయి. ప్రస్తుతంగా రైతుల అవసరాలపై, పథకాల అమలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలనకు వస్తే, ప్రభుత్వం రైతుకు తోడుగా నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. రైతుల రుణ భారం తగ్గించేందుకు పాత రుణాల మాఫీ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. “రైతు బంధు పేరుతో గతంలో అన్ని పథకాలు ఆపేశారు. కానీ ఇప్పుడు అన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి నేరుగా వెళ్లింది రూ.36,000 కోట్లు” అని వెల్లడించారు.
విత్తనాల విషయంలో నకిలీ విత్తనాలను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నకిలీ విత్తనాల విషయంలో పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల విషయంలో షిప్ రాకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అన్ని జబ్బులకూ కారణం యూరియా. కేంద్రానికి కూడా సలహా ఇచ్చాను. యూరియా తగ్గిస్తే మన పంటలకు ప్రపంచ మార్కెట్ లో విలువ పెరుగుతుందని అన్నారు.
Also Read
- Ashirvad Sooryavanshi: 19 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆశీర్వాద్ సూర్యవంశీ వీర విహారం.. మురిసిపోయిన వైభవ్..
- Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Mahua Moitra: ఆ రాత్రంతా ఏడ్చాను.. సువేందు అండగా ఉన్నారు.. మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
Plane Crash: విమాన ప్రమాద దర్యాప్తులో అమెరికా ఎందుకు పాల్గొంటోంది?
డ్రై ల్యాండ్ పంటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు, గతంలో ఇచ్చినట్లే ఇప్పుడు కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. తోటలు వేసిన రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చే యోచనలో ఉన్నామన్నారు. పెంచిన మద్దతు మొత్తం రూ.6,000. మునుపు రూ.5,000 ఇస్తే, ఇప్పుడు పెంచాం అని తెలిపారు.
పామాయిల్ ఉత్పత్తిపై ప్రాముఖ్యత పెరుగుతోంది. “కొణిజర్లలో రిఫైనరీ, సీడ్ గార్డెన్ ఏర్పాటు అవుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేనిది. వచ్చే సీజన్కు వెంసూర్, కొణిజర్ల ఫ్యాక్టరీలు సిద్ధం చేస్తాం” అని వెల్లడించారు. తెలంగాణలో మినిమం గ్యారెంటీ ప్రైస్ ఉండాలని కోరారు. సౌత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధానిని కలిసి ఒత్తిడి తీసుకురాగలమని భావిస్తున్నాం అని తెలిపారు. తెలంగాణ వరి ఉత్పత్తిలో టాప్ లో ఉందని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ ఆరోపణలపై స్పందిస్తూ, “కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు, కానీ అభివృద్ధి జరగాలి” అని అన్నారు. అలాగే మార్కెట్ చైర్మన్ నియామకం ఎమ్మెల్యే పరిధిలో జరిగిందని పేర్కొన్నారు.
Boeing: బోయింగ్ని ముందే హెచ్చరించిన మాజీ ఉద్యోగి.. ఆ తర్వాత అనుమానాస్పద మృతి..
తాజావార్తలు
-
Bellam Rava Laddu: నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! 10 నిమిషాల్లో హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు’.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేయొచ్చు!
-
Ashirvad Sooryavanshi: 19 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆశీర్వాద్ సూర్యవంశీ వీర విహారం.. మురిసిపోయిన వైభవ్..
-
ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!