Boeing: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఎయిరిండియా ఆపరేట్ చేస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో కూలిపోవడంతో విమానంలోని 242 మందిలో 241 మంది మరణించారు. మెడికల్ కాలేజ్ హస్టల్పై కూలడంతో 24మమది మెడికోలు మరణించారు. అయితే, ఈ ప్రమాదం తర్వాత బోయింగ్ సంస్థపై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
బోయింగ్ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ అనుమానస్పద మరణించడం, ఆయన బోయింగ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం వంటివి వార్తల్లో ప్రధానాంశాలుగా నిలిచాయి. బార్నెట్ 2024లో సౌత్ కరోలినా చార్టెస్టర్ కౌంటీలోని తన ఇంట్లో మరణించారు.
62 ఏళ్ల బార్నెట్ అనారోగ్య కారణాలతో 2017లో పదవీ విరమణ చేశారు. బోయింగ్ సంస్థలో మూడు దశాబ్ధాలకి పైగా పనిచేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత బోయింగ్పై అనేక ఆరోపణలు చేసి, చట్టపరమైన చర్యల్ని ప్రారంభించారు. 2010 నుండి 787 డ్రీమ్లైనర్ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్లో క్వాలిటీ మేనేజర్గా పనిచేశాడు. ఇప్పుడు ఎయిరిండియా ప్రమాదంలో కూలిపోయింది కూడా ఈ తరహా విమానమే.
బోయింగ్ గురించి సంచలన ఆరోపణలు:
2019లో బీబీసీతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారని ఆయన వెల్లడించారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాడు. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయడని చెప్పారు. బోయింగ్ అత్యాధునిక 787 డ్రీమ్ లైనర్ క్యాబిన్ డికంప్రెషన్ సమయంలో ప్రయాణికులు మాస్కులు లేకుండా ఉండొచ్చనే విషయాన్ని వెల్లడించారు.
కొన్ని పరీక్షల్ని ప్రస్తావిస్తూ.. ఆక్సిజన్ వ్యవస్థల్లో నాలుగింట ఒక వంతు తప్పుగా ఉంచొచ్చని, అవసరమైన సమయాల్లో పనిచేయకపోవచ్చని బార్నెట్ చెప్పారు. ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్లపై పరీక్ష తర్వాత, 787 డ్రీమ్లైనర్ 25 శాతం వైఫల్యాన్ని చూపించిందని బార్నెట్ కనుగొన్నాడు. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగిందని, ఇది భద్రతపై రాజీ పడిందని ఆయన అన్నారు.
ఇదే కాకుండా కార్మికులు కర్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ప్రొడక్షన్ లైన్లో జాప్యాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా స్ర్కాప్ బిన్ల నుంచి తక్కువ ప్రామాణిక భాగాలను ఉపయోగించిందని, వాటిని విమానాలకు అమర్చారని అతను ఆరోపించాడు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యలేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ కొన్ని ఆందోళనల్ని సమర్థించింది.
అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది.
జాన్ బార్నెట్ అనుమానాస్పద మరణం
మార్చి 9, 2024న, దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్లోని ఒక హోటల్ వెలుపల తన పికప్ ట్రక్కులో జాన్ బార్నెట్ చనిపోయి కనిపించాడు. బోయింగ్పై తన విజిల్బ్లోయర్ కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధమవుతున్నప్పుడు మరణించడం సంచలనంగా మారింది.
పోలీసుల విచారణలో తలపై తుపాకీ గాయంతో ఉన్నట్లు కనుగొన్నారు. అతని కుడి చేతిలో ఒక హ్యాండ్గన్ ఉంది , అధికారులు తెలిపిన దాని ప్రకారం అది ఆత్మహత్య అని ఫోరెన్సిక్ ఆధారాలు నిర్ధారించాయి. వాహనంలో చేతితో రాసిన ఒక నోట్ దొరికింది, అందులో “నేను ఇకపై ఇలా చేయలేను. ఫక్ బోయింగ్. బోయింగ్ మూల్యం చెల్లించాలని నేను ప్రార్థిస్తున్నాను” అని రాసి ఉంది.