Bhatti Vikramarka : 10 ఏళ్లు వెనుకపడ్డాం.. ఇప్పుడు పరుగులు పెట్టక తప్పదు
- 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసింది
- ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందజలో ఉంది
- వారం రోజుల్లో నగదు కూడా వారి అకౌంట్ కి వేశాం : భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లాలో అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశాన్ని చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొన్న భట్టి, జిల్లాల ఇంచార్జి మంత్రులు అన్ని ప్రాంతాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. భట్టి ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కొనుగోలు చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఇందులో ముందంజలో ఉన్నాయని కొనియాడారు. ఇకపై ధరలు చెల్లింపులు వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో 2–3 నెలలు ఆలస్యం అయ్యేదని గుర్తుచేశారు.
Tiktok : టిక్టాక్పై అమెరికా యూ-టర్న్, భారత్ నో-టర్న్..!
Also Read
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దేశంలో ఎక్కడ లేనంతగా ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల మేర శాంక్షన్ చేయడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించడం గొప్ప ముందడుగని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,56,000 ఇళ్లకు నిర్మాణాలు ప్రారంభించినట్లు తెలిపారు. కొన్ని చిన్నపాటి పొరబాట్లు మినహా ఈ మంచి కార్యక్రమాన్ని చెడుగా మలచకూడదని అధికారులకు సూచించారు.
భూ హక్కులపై ప్రభుత్వ దృష్టిని స్పష్టం చేసిన భట్టి, “భూ భారతి పథకాన్ని 10 ఏళ్లు చూశాం. ధరణి ద్వారా ప్రజలకు సరళమైన, న్యాయమైన హక్కులు లభించాయి. దాన్ని తొలగిస్తామని ఎన్నికల హామీ ఇచ్చాం. దానిని అమలుచేయడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కసరత్తు చేస్తున్నారు” అని చెప్పారు.
విత్తనాల పంపిణీ సక్రమంగా జరగాలని, నకిలీ విత్తనాలపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. తాగునీరు లీకేజీలపై శ్రద్ధ వహించాలని, ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. “గతంలో ప్రభుత్వాలు విభాగాలను గాలికి వదిలేశాయి. కానీ ప్రస్తుతం బడ్జెట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, నిధులు విడుదల చేస్తాం” అన్నారు. “10 ఏళ్లు వెనుకపడ్డాం. ఇప్పుడు పరుగులు పెట్టక తప్పదు. లక్ష్యాలను చేరుకోవాలంటే ఇదే మార్గం” అంటూ భట్టి స్పష్టమైన సందేశం ఇచ్చారు.
Illegal Affair : భర్త అన్నతో హనీమూన్.. ఆ పనిచేస్తుండగా దొరికేసిన భార్య
తాజావార్తలు
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!