Kerala: పులి దాడి చేసిన ఘటనలో ఓ రైతు మరణించిన ఘటన కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో జరిగింది. వాయనాడ్లోని వాకేరి ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 36 ఏళ్ల ప్రజీష్ అనే రైతుపై పులి దాడి చేసింది. నివేదికల ప్రకారం.. ప్రజీష్ పశువులకు గడ్డి తీసుకురావడానికి మధ్యాహ్నం వరి పొలానికి వెళ్లాడు. అయితే సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో బంధువులు వెతకగా.. వాకేరిలో ప్రజీష్ మృతదేహం కనబడింది. అతని ఎడమ కాలు, తొడతో సహా.. అతని తలలో కొంత భాగాన్ని పులి తిన్నట్లు గుర్తించారు.
Read Also: Viral News : వార్నీ.. ఇదేం పెళ్లి కార్డు సామి.. పిచ్చి మాములుగా లేదుగా..
కాగా.. ఈ ఘటనపై అటవీశాఖ అప్పుడు ఏం పట్టించుకోనప్పటికీ, తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రైతుపై దాడి చేసి చంపిన పులిని చంపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రాణాంతక చర్యలను ఆశ్రయించే ముందు పులి నరమాంస భక్షకమని అధికారులు నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.
Read Also: Mangalagiri: వైసీపీకి వరుస షాక్లు..! మంగళగిరిలో కొనసాగుతున్న రాజీనామాలు..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలోనే జనవరిలో వాయనాడ్ జిల్లాలో పులి దాడి చేసిన ఘటనలో 52 ఏళ్ల రైతు కూడా మరణించాడు. ఇలా.. రైతులు పొలాల దగ్గర వెళ్దామంటే పులి దాడిచేసిన ఘటనలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.