Delhi: ఢిల్లీ తదుపరి సీఎస్ పీకే గుప్తా!.. కేంద్ర అనుమతిని కోరిన ఆప్ సర్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీకే గుప్తాను నియమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కేంద్రం ఆమోదం కోరినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ ప్రతిపాదనను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్-గవర్నర్ వీకే సక్సేనాకు పంపారు. ఆయన నియామకానికి అనుమతిని అభ్యర్థించారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ఈ ఏడాది చివరి నాటికి పదవీ విరమణ చేయనున్నారు.
Read Also: RBI: రూ.535 కోట్ల నగదుతో రోడ్డుపై నిలిచిపోయిన కంటైనర్.. ఆ తర్వాత ఏమైందంటే?
Also Read
పీకే గుప్తా ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ)లో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. మే 16న సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పులో అధికారుల బదిలీ, పోస్టింగ్తో సహా సేవల వ్యవహారాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి కార్యనిర్వాహక అధికారం ఇవ్వబడింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అధికార పరిధిలోకి వచ్చే భూమి, పోలీసు, పబ్లిక్ ఆర్డర్లకు సంబంధించిన సేవల శాఖ వ్యవహారాలపై శాసన, కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!