Karnataka: 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత.. స్పీకర్ ఉత్తర్వులు..!
- అనుచిత ప్రవర్తన కారణంగా మార్చి 21న 18 బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్
- సస్పెన్షన్ను అధికారికంగా ఎత్తివేసిన స్పీకర్ యు.టీ. ఖాదర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో రెండు నెలల క్రితం అనుచిత ప్రవర్తన కారణంగా ఆరు నెలల పాటు సస్పెండ్ చేయబడ్డ 18 బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని స్పీకర్ ఖాదర్ ఆదివారం అధికారికంగా ఎత్తివేశారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత ఆర్. అశోక, న్యాయ శాఖ మంత్రి హెచ్.కే. పాటిల్లతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. మార్చి 21న బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్కు వ్యతిరేకంగా వ్యవహరించడంతో వారిపై “అనుచిత ప్రవర్తన” ఆరోపణలతో సస్పెన్షన్ విధించబడింది. ఆ సమయంలో ఎమ్మెల్యేలు స్పీకర్ కుర్చీ చుట్టూ చేరి ఆందోళన చేపట్టారు. కొంతమంది కాగితాలు విసిరి హల్చల్ సృష్టించడంతో, వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు తరలించాల్సి వచ్చింది.
Read Also: Pat Cummins: ఈ ఏడాది మాది కాదు.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఇక తాజాగా జరిగిన సమీక్ష సమావేశం అనంతరం స్పీకర్ ఖాదర్ మీడియాతో మాట్లాడుతూ.. అది ఒక నిర్బంధ పరిస్థితిలో జరిగిన సంఘటన. అయితే నేటి సమావేశంలో మంత్రులు, ప్రతిపక్ష నాయకులు కలిసి చర్చించి సస్పెన్షన్ ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఎమ్మెల్యేలు మా శత్రువులు కాదు, మిత్రులే అని అన్నారు. అంతేకాక, ఈ నిర్ణయాన్ని శాసనసభ వచ్చే సమావేశంలో అధికారికంగా ఆమోదిస్తారు. అన్ని పార్టీలు సంఘర్షణకు బదులు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలి. బీజేపీ ఎమ్మెల్యేలు తమ తప్పును గ్రహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అని అన్నారు.
Read Also: Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు.. దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు!
సస్పెన్షన్ ఎత్తివేతపై కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కూడా ముఖ్యమంత్రి, స్పీకర్ లకు లేఖ రాశారు. అలాగే కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శోభా కరంద్లాజే వంటి నాయకులు కూడా స్పీకర్ను సంప్రదించారు. ప్రతిపక్ష నేత అశోక ఈ విషయంలో అనేకసార్లు స్పీకర్ను కలిశారు. ఆయన నుంచి లిఖితపూర్వకంగా క్షమాపణల లేఖ కూడా అందిందని ఖాదర్ వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తివేసిన ఎమ్మెల్యేలలో ముఖ్యంగా దొడ్డనగౌడ జి. పాటిల్, మాజీ డిప్యూటీ సీఎం సి.ఎన్. అశ్వత్ నారాయణ్, ఎస్.ఆర్. విశ్వనాథ్, బి.ఏ. బసవరాజు, బి.పి. హరీష్, చంద్రు లామాణి, మునిరత్న తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!