Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pawan Kalyan Says Pm Modi Does Not Look For Votes He Thinks Only Development

Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు.. దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు!

NTV Telugu Twitter
Published Date :May 26, 2025 , 7:56 am
By Sampath Kumar
  • ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు
  • హిమాలయాల మాదిరి మోడీ ఎక్కడా తలవంచరు
  • ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటారు
Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు.. దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని నరేంద్ర మోడీ ఓట్లు కోసం చూడరని, దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో ప్రధాని సైతం ఎక్కడా తలవంచరన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను చాటిన ఘనత ప్రధానిదే అని స్పష్టం చేశారు. ‘పీఎం-జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము అని డిప్యూటీ సీఎం చెప్పారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ఓట్లు వస్తాయా?, రావా? అనేది ఆలోచన చేయలేదు. దేశ అభివృద్ధే లక్ష్యంగా కర్తవ్య నిర్వహణలో ఉన్నారు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం ‘పీఎం-జన్ మన్’ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పర్టీక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) ఉండే ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించగలుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే పీఎం-జన్ మన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.555.61 కోట్ల నిధులతో 612.72 కిమీ మేర రహదారులు నిర్మిస్తున్నాము. ఇవన్నీ పీవీటీజీ ఆవాసాలను అనుసంధానించే రహదారులే. వీటి ద్వారా ఏడు జిల్లాల్లో 239 పీవీటీజీ ఆవాసాలకు రహదారులు ఏర్పరచగలుగుతున్నాము’ అని తెలిపారు.

‘239 ఆవాసాలకు రహదారులు మూలంగా సుమారు 50 వేల మందికి రోడ్డు సౌకర్యం వస్తుంది. వారు మనకు ఓట్లు వేస్తారా లేదా అనే ఆలోచన ఎక్కడా చేయలేదు మన ప్రధాని గారు. అదే మొత్తాన్ని ఓట్లు వస్తాయి అనే చోట వెచ్చించవచ్చు. ప్రతి ఒక్కరికీ, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలి అనే ఉద్దేశంతో మోడీ గారు ముందడుగు వేస్తున్నారు. ఆ స్ఫూర్తితోతోనే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ మూడు నెలల పాటు రాష్ట్రంలో పర్యటించి రూపొందించిన నివేదికను అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాము’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.

Also Read: PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. టాప్‌-2 టార్గెట్!

‘ఆపరేషన్ సిందూర్, అందుకు దారి తీసిన పరిస్థితులు చాలా క్లిష్టమైనవి. ఇటువంటి దశలో కూడా ప్రజల రక్షణతో పాటు వారి భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి ఆలోచన చేశారు. కుల గణన చేపట్టడం అనేది ఎంతో అవసరం. దేశంలో ఉన్న కులాల పరిస్థితులు, వారి జీవనం, వృత్తులు, స్థితిగతులు మనకు తెలుస్తాయి. వారికి జీవనోపాధుల మెరుగుదలకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి, ఏ పథకాలు తీసుకురావాలో పాలన వర్గాలకు ఒక స్పష్టత వస్తుంది’ అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • cm chandrababu
  • NDA
  • NDA Meeting
  • pawan kalyan

తాజావార్తలు

  • Waqf Act: “వక్ఫ్ ఆస్తుల” రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధం..

  • Sharmistha Panoli: శర్మిష్ట పనోలిపై కేసు పెట్టిన వజహత్ ఖాన్ మిస్సింగ్..

  • Jagtial: పామును కాపాడబోయిన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు గేర్ బాక్స్ లో చొరబడిన పాము.. చివరకు

  • Astrology: జూన్‌ 3, మంగళవారం దినఫలాలు

  • Off The Record : మీనాక్షి నటరాజన్ పదవి ఇప్పించగలరా ? అంత పవర్ ఉందా ?

ట్రెండింగ్‌

  • Realme Buds T200x: అత్యాధునిక ANC ఫీచర్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో కొత్త TWS ఎయిర్‌బడ్స్ లాంచ్..!

  • Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!

  • Rohit Sharma: నన్ను ఔట్ చేయడం సాధ్యమే కాదు.. పిల్లలతో హిట్ మ్యాన్.. వీడియో వైరల్

  • Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

  • Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions