Dharmasthala case: సంచలన ‘ధర్మస్థల’లో అంతా తూచ్.. కంప్లైంట్ చేసిన వ్యక్తి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmasthala case: కర్ణాటకలోని ధర్మస్థలలో వందల సంఖ్యలో మహిళలు, యువతుల మృతదేహాలు పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని, సిట్ ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని చెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు.
READ ALSO: Congress MLA KC Veerendra: ఈయన మామూలు ఎమ్మెల్యే కాదు.. బడా బెట్టింగ్ రాజా..!
Also Read
అనేక వ్యత్యాసాలు.. అసత్య ఆరోపణలు..
ఫిర్యాదుదారుడైన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా 1995 – 2014 మధ్య కాలంలో ధర్మస్థల మందిరంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ సమయంలో మహిళలు, మైనర్లతో సహా అనేక మంది మృతదేహాలను ఖననం చేయవలసి వచ్చిందని, వారిలో కొందరిపై లైంగిక వేధింపుల గుర్తులు ఉన్నాయని ఆయన తన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. తాజాగా సిట్ అధికారులు ఫిర్యాదుదారుడు ఇచ్చిన వాంగ్మూలంలో, సాక్ష్యాలలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం హెడ్ ప్రణవ్ మొహంతి మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడన్న కారణంగా పారిశుద్ధ్య కార్మికుడు భీమాను అరెస్ట్ చేశామన్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఫిర్యాదుదారుడిని విచారించామని తెలిపారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన వాంగ్మూలాలు, అందించిన పత్రాలలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయని, అందుకే ఈ విచారణ చేపట్టామని పేర్కొన్నారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడని దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. నేడు భీమాను కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఈ కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన బెంగళూరు మహిళ సుజాత భట్ను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మెడిసన్ చదివే తన కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థల వెళ్లి అదృశ్యమైందంటూ ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదంతా కట్టుకథేనని తాజాగా ఆమె పేర్కొన్నారు. దీంతో ఆమె ఇంటికి పోలీసులు శనివారం వెళ్లారు. విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ స్పందించారు. మతపరమైన స్థలం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిందని, దర్యాప్తు ద్వారా అసలు నిజం బయటపడుతుందని అన్నారు. ఈ ఆరోపణలు అబద్ధమని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
READ ALSO: Kukatpally Sahasra Case: మా బాబు వాణ్ణి చంపేద్దామని అంటున్నాడు.. సహస్ర తల్లి సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?