Siddaramaiah: నేడు తుంగభద్ర డ్యామ్ను పరిశీలించనున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
- వేగంగా సాగుతున్న తుంగభద్ర గేటు మరమ్మతు పనులు
- స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారుల ప్రయత్నాలు
- నేడు తుంగభద్ర డ్యామ్ను పరిశీలించనున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: తుంగభద్ర గేటు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు పూర్తిగా వృథాకాక ముందే స్టాప్లాగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు. మొదట డ్యామ్ క్రస్టు స్థాయి 1613 అడుగుల వరకు నీటిని వదిలేసి.. ఆ తర్వాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్లాగ్ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం అలా కాకుండా క్రస్టు స్థాయి కన్నా ఎగువకు నీళ్లు ఉన్న సమయంలోనే స్టాప్లాగ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇలా చేస్తే నీటిని పూర్తిగా వృథా కాకుండా చూడొచ్చని అంటున్నారు. ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన సమయం నుంచి సోమవారం రాత్రి 9 గంటల వరకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో జలాశయంలోకి సగటున 25, 571 క్యూసెక్కుల నీరు వస్తోంది. 19 గేట్ల నుంచి 99,567 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Read Also: ACB Raids: మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
నేడు హోస్పేటలో తుంగభద్ర డ్యాంను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పరిశీలించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19 గేటు కొట్టుకుపోవడంతో ఆయన పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 11.50 కి కొప్పలకు కర్ణాటక సీఎం చేరుకోనున్నారు. కొప్పల నుంచి రోడ్డు మార్గంలో 12.15కి తుంగభద్ర ప్రాజెక్టు చేరుకోనున్నారు సీఎం సిద్ధరామయ్య. తుంగభద్ర ప్రాజెక్టును పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో కర్ణాటక సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తుంగభద్ర జలాశయం నుంచి కొప్పలకు రోడ్డు మార్గంలో వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరు వెళ్లనున్నారు సీఎం సిద్ధరామయ్య. మరో వైపు ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్లు కూడా డ్యామ్ను పరిశీలించనున్నారు. స్థానిక డ్యాం, ఇరిగేషన్ అధికారులతో భేటీ కానున్నారు.
తాజావార్తలు
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!