Vijayendra: అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు సీఎం ఎటువంటి స్థాయికైనా దిగజారుతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayendra: కర్ణాటకలో ముస్లింలకు గృహ పథకాల కింద రిజర్వేషన్ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచే నిర్ణయం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల మోత మోగుతోంది. నేడు ( జూన్ 20) కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా మతపరమైన మెప్పింపు రాజకీయమేనని విమర్శించారు. సిద్ధరామయ్య అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు ఎటువంటి స్థాయికైనా దిగజారగలరని నిరూపించుకున్నారు. ఇది వారి విధానానికి అద్దంపడుతోంది. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉండదు. కానీ, దేశవిద్రోహ శక్తులకు మాత్రం కచ్చితంగా వ్యతిరేకమే అని స్పష్టం చేశారు.
Read Also: Thailand: ఫోన్ కాల్ లీక్.. థాయ్లాండ్ యువ ప్రధాని పదవికి గండం!
Also Read
- BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను పాటిస్తున్నామంటూ చెబుతుంది. కానీ, ఇది వారి చర్యలతో స్పష్టంగా ఒప్పుకోలేనిదని.. అల్పసంఖ్యాకులకు ఓటు బ్యాంకుగా చూడటం తప్పుకదా, వారికి విద్యను, సాధికారతను అందించడమే అసలు అవసరం అని అన్నారు. అలాగే ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు మతం, జాతిని చూడకుండా ప్రతి వర్గానికి లబ్ధిని చేకూర్చాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనా వరకు ఇప్పటివరకు ముస్లింలు పేదరిక రేఖ కిందే ఉన్నారంటే, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపిత అణచివేత విధానమే అని అన్నారు.
Read Also:Marriage: కొడుకుతో నిశ్చితార్థం.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు ఏం జరిగిందంటే?
ఈ వ్యవహారాన్ని బీజేపీ అసెంబ్లీలో తీవ్రంగా లేవనెత్తనున్నట్లు ప్రకటించిన విజయేంద్ర, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో కలిసి నిరసనల బాట పడతామని చెప్పారు. కోర్టు ఇప్పటికే రాజకీయ నాయకత్వ తప్పిదం అని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ సీఎం మౌనం వహించటం దురదృష్టకరం అన్నారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావించిన ఆయన, ఈ బాధ్యతను నిర్దోష అధికారులు, ఐపీఎస్ అధికారులపై వేశారన్నారు. కానీ, ఇది ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమే. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నైతికంగా బాధ్యత వహించాలని అన్నారు.
తాజావార్తలు
-
VIDA VX2 Plus: 187KM రేంజ్తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!