Vijayendra: అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు సీఎం ఎటువంటి స్థాయికైనా దిగజారుతారు..!
Vijayendra: కర్ణాటకలో ముస్లింలకు గృహ పథకాల కింద రిజర్వేషన్ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచే నిర్ణయం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల మోత మోగుతోంది. నేడు ( జూన్ 20) కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా మతపరమైన మెప్పింపు రాజకీయమేనని విమర్శించారు. సిద్ధరామయ్య అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు ఎటువంటి స్థాయికైనా దిగజారగలరని నిరూపించుకున్నారు. ఇది వారి విధానానికి అద్దంపడుతోంది. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉండదు. కానీ, దేశవిద్రోహ శక్తులకు మాత్రం కచ్చితంగా వ్యతిరేకమే అని స్పష్టం చేశారు.
Read Also: Thailand: ఫోన్ కాల్ లీక్.. థాయ్లాండ్ యువ ప్రధాని పదవికి గండం!
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను పాటిస్తున్నామంటూ చెబుతుంది. కానీ, ఇది వారి చర్యలతో స్పష్టంగా ఒప్పుకోలేనిదని.. అల్పసంఖ్యాకులకు ఓటు బ్యాంకుగా చూడటం తప్పుకదా, వారికి విద్యను, సాధికారతను అందించడమే అసలు అవసరం అని అన్నారు. అలాగే ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు మతం, జాతిని చూడకుండా ప్రతి వర్గానికి లబ్ధిని చేకూర్చాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనా వరకు ఇప్పటివరకు ముస్లింలు పేదరిక రేఖ కిందే ఉన్నారంటే, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపిత అణచివేత విధానమే అని అన్నారు.
Read Also:Marriage: కొడుకుతో నిశ్చితార్థం.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు ఏం జరిగిందంటే?
ఈ వ్యవహారాన్ని బీజేపీ అసెంబ్లీలో తీవ్రంగా లేవనెత్తనున్నట్లు ప్రకటించిన విజయేంద్ర, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో కలిసి నిరసనల బాట పడతామని చెప్పారు. కోర్టు ఇప్పటికే రాజకీయ నాయకత్వ తప్పిదం అని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ సీఎం మౌనం వహించటం దురదృష్టకరం అన్నారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావించిన ఆయన, ఈ బాధ్యతను నిర్దోష అధికారులు, ఐపీఎస్ అధికారులపై వేశారన్నారు. కానీ, ఇది ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమే. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నైతికంగా బాధ్యత వహించాలని అన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!