Vijayendra: అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు సీఎం ఎటువంటి స్థాయికైనా దిగజారుతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayendra: కర్ణాటకలో ముస్లింలకు గృహ పథకాల కింద రిజర్వేషన్ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచే నిర్ణయం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల మోత మోగుతోంది. నేడు ( జూన్ 20) కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా మతపరమైన మెప్పింపు రాజకీయమేనని విమర్శించారు. సిద్ధరామయ్య అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు ఎటువంటి స్థాయికైనా దిగజారగలరని నిరూపించుకున్నారు. ఇది వారి విధానానికి అద్దంపడుతోంది. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉండదు. కానీ, దేశవిద్రోహ శక్తులకు మాత్రం కచ్చితంగా వ్యతిరేకమే అని స్పష్టం చేశారు.
Read Also: Thailand: ఫోన్ కాల్ లీక్.. థాయ్లాండ్ యువ ప్రధాని పదవికి గండం!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను పాటిస్తున్నామంటూ చెబుతుంది. కానీ, ఇది వారి చర్యలతో స్పష్టంగా ఒప్పుకోలేనిదని.. అల్పసంఖ్యాకులకు ఓటు బ్యాంకుగా చూడటం తప్పుకదా, వారికి విద్యను, సాధికారతను అందించడమే అసలు అవసరం అని అన్నారు. అలాగే ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు మతం, జాతిని చూడకుండా ప్రతి వర్గానికి లబ్ధిని చేకూర్చాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనా వరకు ఇప్పటివరకు ముస్లింలు పేదరిక రేఖ కిందే ఉన్నారంటే, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపిత అణచివేత విధానమే అని అన్నారు.
Read Also:Marriage: కొడుకుతో నిశ్చితార్థం.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు ఏం జరిగిందంటే?
ఈ వ్యవహారాన్ని బీజేపీ అసెంబ్లీలో తీవ్రంగా లేవనెత్తనున్నట్లు ప్రకటించిన విజయేంద్ర, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో కలిసి నిరసనల బాట పడతామని చెప్పారు. కోర్టు ఇప్పటికే రాజకీయ నాయకత్వ తప్పిదం అని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ సీఎం మౌనం వహించటం దురదృష్టకరం అన్నారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావించిన ఆయన, ఈ బాధ్యతను నిర్దోష అధికారులు, ఐపీఎస్ అధికారులపై వేశారన్నారు. కానీ, ఇది ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమే. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నైతికంగా బాధ్యత వహించాలని అన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!