Vijayendra: అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు సీఎం ఎటువంటి స్థాయికైనా దిగజారుతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayendra: కర్ణాటకలో ముస్లింలకు గృహ పథకాల కింద రిజర్వేషన్ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచే నిర్ణయం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల మోత మోగుతోంది. నేడు ( జూన్ 20) కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా మతపరమైన మెప్పింపు రాజకీయమేనని విమర్శించారు. సిద్ధరామయ్య అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు ఎటువంటి స్థాయికైనా దిగజారగలరని నిరూపించుకున్నారు. ఇది వారి విధానానికి అద్దంపడుతోంది. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉండదు. కానీ, దేశవిద్రోహ శక్తులకు మాత్రం కచ్చితంగా వ్యతిరేకమే అని స్పష్టం చేశారు.
Read Also: Thailand: ఫోన్ కాల్ లీక్.. థాయ్లాండ్ యువ ప్రధాని పదవికి గండం!
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను పాటిస్తున్నామంటూ చెబుతుంది. కానీ, ఇది వారి చర్యలతో స్పష్టంగా ఒప్పుకోలేనిదని.. అల్పసంఖ్యాకులకు ఓటు బ్యాంకుగా చూడటం తప్పుకదా, వారికి విద్యను, సాధికారతను అందించడమే అసలు అవసరం అని అన్నారు. అలాగే ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు మతం, జాతిని చూడకుండా ప్రతి వర్గానికి లబ్ధిని చేకూర్చాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనా వరకు ఇప్పటివరకు ముస్లింలు పేదరిక రేఖ కిందే ఉన్నారంటే, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపిత అణచివేత విధానమే అని అన్నారు.
Read Also:Marriage: కొడుకుతో నిశ్చితార్థం.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు ఏం జరిగిందంటే?
ఈ వ్యవహారాన్ని బీజేపీ అసెంబ్లీలో తీవ్రంగా లేవనెత్తనున్నట్లు ప్రకటించిన విజయేంద్ర, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో కలిసి నిరసనల బాట పడతామని చెప్పారు. కోర్టు ఇప్పటికే రాజకీయ నాయకత్వ తప్పిదం అని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ సీఎం మౌనం వహించటం దురదృష్టకరం అన్నారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావించిన ఆయన, ఈ బాధ్యతను నిర్దోష అధికారులు, ఐపీఎస్ అధికారులపై వేశారన్నారు. కానీ, ఇది ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమే. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నైతికంగా బాధ్యత వహించాలని అన్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!