Karnataka Bandh: కర్ణాటకలో ఆందోళనలు, అరెస్టులు.. డిపోలకే పరిమితమైన బస్సులు! 44 విమానాలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Section 144 imposed in Karnataka over Cauvery Issue: కర్ణాటకలో నేడు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ.. కన్నడ, రైతు సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు మద్దతుగా హోటళ్లు, విద్యా-వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, ప్రైవేటు సంస్థలు అన్నీ మూతబడ్డాయి. మరోవైపు బస్సులు డిపోలకే పరిమితం కాగా.. ట్యాక్సీలు, ఆటోలు కూడా నిలిచిపోయాయి. ఇక బెంగళూరు విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో కర్ణాటక పూర్తిగా స్తంభించింది.
కర్ణాటక రక్షణ వేదికె, జయ కర్ణాటక సంఘం, ఇతర కన్నడ సంఘాలు, రైతు సంఘం, చెరకు సాగుదారుల సంఘం, హసిరుసేన, ట్యాక్సీ- ఆటోరిక్షా సంఘాలు, సినిమా కళాకారుల సంఘం, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి.. ఇలా వందకు పైగా సంస్థలు నేడు కర్ణాటక బంద్కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 నుంచే ఈ బంద్ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసన చేపట్టారు. మైసూరు బస్టాంట్ ముందు రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రైతు సంఘాల దీంతో ఆందోళనలతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
కొందరు ఆందోళనకారులు పెట్రోల్ బంక్లోకి దూసుకొచ్చి బలవంతంగా మూసివేయించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 50 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. బంద్ దృష్ట్యా శుక్రవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. పలు చోట్ల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.
Also Read: Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ హవా.. షూటింగ్లో రెండు స్వర్ణాలు, టెన్నిస్లో రజతం!
తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కర్ణాటక సరిహద్దు 5 జిల్లాల్లో భద్రత భారీగా ఉంది. తమిళనాడు వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత తమిళనాడుకు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సులను శుక్రవారం అర్ధరాత్రి వరకు నిలిపివేశారు. కావేరీ జలాల విడుదలపై గత మంగళవారమే బెంగళూరులో బంద్ చేపట్టారు. ఆ బంద్ కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.1000 నుంచి 1500కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి బంద్ చేపట్టడంతో భారీ నష్టం రానుంది.
తాజావార్తలు
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!