Karmani Selvam: వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సీనియర్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కలిగిన పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR INOX Pictures) అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్గా చేరింది. పీవీఆర్ సంస్థ అండతో ఈ చిత్రం దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్క్రీన్లను దక్కించుకోనుంది.
READ ALSO: India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియాకు బ్రూక్ బిగ్ సవాల్..
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ.. “ఇది ప్రతి సామాన్యుడిని కదిలించే కథ. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ లాంటి పెద్ద సంస్థ మా చిత్రంతో జతకట్టడం వల్ల, మా సినిమా మరింత పెద్ద ఎత్తున ప్రేక్షకులకు చేరుతుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు. ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్ మీనన్లతో పాటు లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రం ఒక సాధారణ కార్ డ్రైవర్ ‘సెల్వం’ చుట్టూ తిరుగుతుందని, నిజాయితీగా బ్రతకాలని కోరుకునే సెల్వం, ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్లను, సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ అని చెబుతున్నారు.
READ ALSO: Ibrahim Zadran : వరల్డ్ కప్ షాక్.. పాపం ఆఫ్ఘన్ క్రికెట్ టీం కెప్టెన్ ఔట్! కొత్త సారథి ఎవరంటే?