Extramarital Affair: యూట్యూబ్లో చూసి భర్త హత్యకు భార్య ప్లాన్.. మద్యం తాగించి, చెవిలో గడ్డిమందు పోసి..!
- భర్తల పాలిట మృత్యువుగా భార్యలు
- పక్కాగా స్కేచ్ వేసి హత్య చేస్తున్న భార్యలు
- యూట్యూబ్లో వీడియోస్ చూసి ప్రియుడితో హత్య
Karimnagar Woman Kills Husband After Watching YouTube Videos: ఇటీవలి కాలంలో భర్తల పాలిట భార్యలు మృత్యువుగా మారారు. ఇష్టంలేని పెళ్లి, వివాహేతర సంబంధం లాంటి పలు కారణాలతో తాళి కట్టిన భర్తలను భార్యలు పక్కాగా స్కేచ్ వేసి హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలో భార్యలు జైలు పాలవుతున్నారు. అయినా కూడా భర్తల హత్యలు ఆగడం లేదు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటుచేసుకుంది. భర్త పెట్టే ఇబ్బందులను తట్టుకోలేని ఓ భార్య.. యూట్యూబ్లో వీడియోస్ చూసి ప్రియుడితో దారుణంగా హత్య చేయించింది. ఏమీ తెలియనట్లు నాటకమాడి.. చివరకు పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన కరీంనగర్ సుభాష్ నగర్లో చోటుచేసుకుంది.
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపిన ప్రకారం… సుభాష్ నగర్కు చెందిన ఐలవేణి సంపత్ (45) జిల్లా లైబ్రరీలో స్వీపర్గా పని చేసేవారు. అతనికి భార్య రమాదేవి, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య రమాదేవి సర్వపిండి వ్యాపారం చేసేది. సంపత్ రోజూ మద్యం తాగి భార్యను కొట్టేవాడు. సంపత్కు స్నేహితుడైన కర్రె రాజయ్యతో రమాదేవికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని రమాదేవి నిర్ణయించుకుంది. యూట్యూబ్లో వీడియోస్ చూసి పథకం వేసింది. తాను యూట్యూబ్లో ఓ వీడియో చూశానని, ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని, అదే పద్ధతిలో భర్తను హత్య చేయాలని ప్రియుడు రాజయ్యకు రమాదేవి చెప్పింది.
Also Read
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
జులై 29న భార్య రమాదేవితో గొడవపడిన సంపత్.. ఇంటి నుంచి వెళ్లిపోయారు. అదేరోజు సంపత్ను రాజయ్య మద్యం తాగేందుకు పిలిచాడు. బొమ్మకల్ రైల్వే ట్రాక్ వద్ద రాజయ్య స్నేహితుడు కీసరి శ్రీనివాస్ కూడా వారితో ఉన్నాడు. సంపత్ మద్యం బాగా తాగి మత్తులోకి జారుకున్నాడు. ఆ సమయంలో రాజయ్యకు రమాదేవికి ఫోన్ చేసి ప్లాన్ ప్రకారం తన భర్తను చంపాలని చెప్పింది. రాజయ్య తన వెంట తెచ్చుకున్న గడ్డిమందును సంపత్ చెవిలో పోశాడు. కాసేపటికే గడ్డిమందు మెదడుకు చేరి అతడు చనిపోయాడు. ఏమీ తెలియనట్లు భర్త ఇంటికి రాలేదని కుమారుడుతో కలిసి రమాదేవి వెతికింది. మరుసటి రోజు భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 1న సంపత్ మృతదేహందొరికిందని రమాదేవి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
Also Read: Raj Gopal Reddy: సీఎం రేవంత్పై మరోసారి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్!
భర్త మృతికి కారణాలు తెలుసుకోకుండా, మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని రమాదేవి పోలీసులను కోరింది. దాంతో రమాదేవిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి మృతిపై అనుమానం ఉందని కొడుకు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రమాదేవి ఫోన్ను పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారించగా.. తామే హత్య చేసినట్టు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ అంగీకరించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
తాజావార్తలు
-
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
-
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
-
Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?