Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Karimnagar And Peddapalli District Polling Arrangements Are Completed 2

Lok Sabha Elections 2024: కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పోలింగ్కు ఏర్సాట్లు పూర్తి.. పటిష్ట భద్రతా..!

Published Date :May 12, 2024 , 11:04 am
By Mahesh Jakki
Lok Sabha Elections 2024: కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పోలింగ్కు ఏర్సాట్లు పూర్తి.. పటిష్ట భద్రతా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lok Sabha Elections 2024: కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రితో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళనున్న సిబ్బంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 29.79 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కరీంనగర్ లోకసభ స్థానం పరిధిలో 17 లక్షల 97 వేల150 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 5, 852 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో 1, 466 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ పకడ్బందీ భద్రతాను ఏర్పాటు చేశారు. అలాగే, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలను ఈసీ తిప్పికొడుతుంది.

Read Also: police chaging car: పోలీసు తనిఖీ నుంచి తప్పించుకున్న వాహనం పల్టీ.. రూ. కోటిన్నర స్వాధీనం

కాగా, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లలో పురుషుల కంటే 42 వేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా 2, 194 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 288 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి పటిష్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ నిర్వహణ కోసం 10, 200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 215 రూట్లలో 216 మంది సెక్టార్ ఆఫీసర్లల నియామించారు. ఈవీఎంలను తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయగా.. ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేయగా 9 కోట్ల రూపాయల వరకు నగదు పట్టిబడింది. రెండు కోట్ల 16 లక్షల రూపాయల విలువ చేసే మద్యం సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, 5, 500 బ్యాలెట్ యూనిట్స్, 2, 743 కంట్రోల్ యూనిట్స్, 3,077 వీవీ ప్యాట్స్ ను సిద్ధం చేసినట్లు ఈసీ తెలిపింది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి కోరారు. ఇప్పటికే 16 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.

Read Also: Elections 2024: ములుగు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం..

ఇక, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసీ పేర్కొనింది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన పెద్దపల్లిలో 33 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 15 లక్షల 96 వేల 430 మంది ఓటర్లు ఉండగా.. 1850 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 221 సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 497 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 131 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు తీవ్రవాద ప్రాబల్యం గల మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించబోతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Read Also: Lok Sabha Elections 2024: ఈ ఎన్నికల్లో యంగ్ ఓటర్స్ ఎవరి వైపు..?

అలాగే, పోలింగ్ విధుల కోసం 10, 216 మంది సిబ్బంది నియామించినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ప్రతి ఒక్కరు స్వేచ్చగా నిర్బయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఇప్పటి వరకు 2 కోట్ల 12 లక్షల 23 వేల 742 రూపాయలను సీజ్ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా 3, 220 మంది పోలీసులతో పాటు ఐదు కంపెనీ సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • karimnagar
  • Lok Sabha elections-2024
  • Peddapalli
  • polling arrangements
  • telangana

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions