Lok Sabha Elections 2024: ఈ ఎన్నికల్లో యంగ్ ఓటర్స్ ఎవరి వైపు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. శనివారంతో పార్టీల ప్రచారానికి తెరపడింది. దీంతో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పోలింగ్ కోసం ఏర్పాట్లను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఇప్పటికే, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ సంఖ్యలో సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది. సెంట్రల్ ఫోర్స్, మైక్రో అబ్సర్వర్స్, వెబ్ కాస్టింగ్ తో మానిటరింగ్ చేసేలా తగిన ఏర్పాట్లను చేసింది. రేపు (మే 13) ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం నుంచే రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ 144 సెక్షన్ను అమల్లోకి తీసుకొచ్చింది.
Read Also: Election Duty: ఎన్నికల డ్యూటీ శిక్షణకు గైర్హాజరు.. 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసు
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇక, వందల సంఖ్యలో పారామిలిటరీ బలగాలను ఈసీ మోహరించింది. ఈ ఎన్నికల్లో భారీగా మద్యాన్ని, నగదునూ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. తెలంగాణలో 300 కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుబడితే, ఆంధ్రప్రదేశ్ లో అంతా కలిపి దాదాపు 270 కోట్ల రూపాయల విలువైన సొత్తును సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మరి, ఎన్నికల్లో ఈ డబ్బు, మద్యం ప్రభావం ఎంత వరకు పని చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగే పంపకాల కార్యక్రమంపై కూడా ఈసీ నజర్ పెట్టింది.
Read Also: Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడి హతమార్చేందుకు యత్నం.. చివరకు ఏమైందంటే..?
కాగా, మరోవైపు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృతంగా హోర్డింగులు పెట్టి మరీ ప్రచారం చేస్తుంది. ఇటు, ఓట్ల కోసం నగర వాసులు.. సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. మరి, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా?లేదా? అన్నది కీలకంగా మారింది. ఈసారి కొత్తగా లక్షల మంది యంగ్ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు.. తొలి సారి తమ ఓటు హక్కును వేయబోతున్నారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, తెలంగాణలోని యువ ఓటర్లు సైతం ఎవరికి మద్దతు ఇస్తారనే కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!