SL vs NZ : రెండో టెస్టులో తేలిపోయిన లంక.. క్లీన్ స్వీప్ చేసిన కివీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ సిప్ ఫైనలో రేసులో టీమిండియా, ఆస్ట్రేలియాలతో శ్రీలంక పోటీ పడింది. ఇండోర్ టెస్టు గెలిచి ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్ కు అర్హత సాధించగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆధిక్యం చూపించి.. భారత క్రికెట్ ఫ్యాన్స్ ని లంకేయులు కంగారు పెట్టారు. శ్రీలంక పోరాటం కారణంగా తొలి టెస్టులో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో మాత్రం లంక జట్టు అలాంటి పోరాట పటిమ చూపించలేకపోయింది. తొలి టెస్టులో రెండో వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకున్న న్యూజిలాండ్, రెండో టెస్టులో పూర్తి డామినేసన్ చూపించి.. ఇన్సింగ్స్ 58 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
Also Read : Indigo Flight : ఇండిగో విమానానికి తప్పిన ముప్పు
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
వెల్లింగ్టన్ టెస్టులో టస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 123 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్సింగ్స్ డిక్లేర్ చేసింది. టామ్ లాథమ్ 21 పరుగులు చేసి అవుట్ కాగా డివాన్ కాన్వే 108 బంతుల్లో 78 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్, హెన్సీ నికొలస్ కలిసి మూడో వికెట్ కి 370 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 215 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్, టెస్టు కెరీర్ చరిత్రలో 25వ సెంచరీ అందుకున్నాడు.
Also Read : Kishan Reddy : మిత్రా మెగాటెక్స్ టైల్స్ పార్క్కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి
అహ్మదాబాద్ టెస్టులో విరాట్ కోహ్లీ 28వ సెంచరీ అందుకోగా శ్రీలంకతో తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్ లో సెంచరీతో 27వ టెస్టు సెంచరినీ కేన్ విలియమ్సన్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ టెస్టు సెంచరీని లంకేయులతో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీతో కేన్ విలియమ్సన్.. విరాట్ రికార్డును సమయం చేశాడు. డార్ల్ మిచెల్ 17 పరుగుల చేసి అవుట్ కాగా హన్రీ నికోలస్ 240 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 200 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచాడు. తొలి ఇన్సింగ్స్ లో 164 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది.
Also Read : Chandrababu Naidu: శాసన సభ కాదు.. కౌరవ సభ.. చరిత్రలో ఇది చీకటి రోజు.
కెప్టెన్ దిముత్ కరుణరత్నే 188 బంతుల్లో 9 ఫోర్లతో 89 పరుగుల చేయగా దినేశ్ చండీమల్ 37, నిశాన్ మధుశ్క 19 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు. శ్రీలంక ఇన్సింగ్స్ లో కుశాల్ మెండిస్, ధనంజయ్ డి సిల్వ, రజిత, అసిత ఫెర్నాండో డకౌడ్ అయ్యారు. ఫాలో ఆన్ ఆడిన లంక, 142 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌట్ అయింది. ఒషాడో ఫెర్నాండో 5 పరుగులు చేయగా దిముత్ కరుణరత్నే 51 పరుగులు, కుశాల్ మెండిస్ 50, దినేశ్ చండీమల్ 62 పరుగులు చేశారు. డబుల్ సెంచరీ చేసిన హెన్రీ నికోలస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!