SL vs NZ : రెండో టెస్టులో తేలిపోయిన లంక.. క్లీన్ స్వీప్ చేసిన కివీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ సిప్ ఫైనలో రేసులో టీమిండియా, ఆస్ట్రేలియాలతో శ్రీలంక పోటీ పడింది. ఇండోర్ టెస్టు గెలిచి ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్ కు అర్హత సాధించగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆధిక్యం చూపించి.. భారత క్రికెట్ ఫ్యాన్స్ ని లంకేయులు కంగారు పెట్టారు. శ్రీలంక పోరాటం కారణంగా తొలి టెస్టులో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో మాత్రం లంక జట్టు అలాంటి పోరాట పటిమ చూపించలేకపోయింది. తొలి టెస్టులో రెండో వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకున్న న్యూజిలాండ్, రెండో టెస్టులో పూర్తి డామినేసన్ చూపించి.. ఇన్సింగ్స్ 58 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
Also Read : Indigo Flight : ఇండిగో విమానానికి తప్పిన ముప్పు
Also Read
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
వెల్లింగ్టన్ టెస్టులో టస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 123 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్సింగ్స్ డిక్లేర్ చేసింది. టామ్ లాథమ్ 21 పరుగులు చేసి అవుట్ కాగా డివాన్ కాన్వే 108 బంతుల్లో 78 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్, హెన్సీ నికొలస్ కలిసి మూడో వికెట్ కి 370 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 215 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్, టెస్టు కెరీర్ చరిత్రలో 25వ సెంచరీ అందుకున్నాడు.
Also Read : Kishan Reddy : మిత్రా మెగాటెక్స్ టైల్స్ పార్క్కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి
అహ్మదాబాద్ టెస్టులో విరాట్ కోహ్లీ 28వ సెంచరీ అందుకోగా శ్రీలంకతో తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్ లో సెంచరీతో 27వ టెస్టు సెంచరినీ కేన్ విలియమ్సన్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ టెస్టు సెంచరీని లంకేయులతో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీతో కేన్ విలియమ్సన్.. విరాట్ రికార్డును సమయం చేశాడు. డార్ల్ మిచెల్ 17 పరుగుల చేసి అవుట్ కాగా హన్రీ నికోలస్ 240 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 200 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచాడు. తొలి ఇన్సింగ్స్ లో 164 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది.
Also Read : Chandrababu Naidu: శాసన సభ కాదు.. కౌరవ సభ.. చరిత్రలో ఇది చీకటి రోజు.
కెప్టెన్ దిముత్ కరుణరత్నే 188 బంతుల్లో 9 ఫోర్లతో 89 పరుగుల చేయగా దినేశ్ చండీమల్ 37, నిశాన్ మధుశ్క 19 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు. శ్రీలంక ఇన్సింగ్స్ లో కుశాల్ మెండిస్, ధనంజయ్ డి సిల్వ, రజిత, అసిత ఫెర్నాండో డకౌడ్ అయ్యారు. ఫాలో ఆన్ ఆడిన లంక, 142 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌట్ అయింది. ఒషాడో ఫెర్నాండో 5 పరుగులు చేయగా దిముత్ కరుణరత్నే 51 పరుగులు, కుశాల్ మెండిస్ 50, దినేశ్ చండీమల్ 62 పరుగులు చేశారు. డబుల్ సెంచరీ చేసిన హెన్రీ నికోలస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!