Harish Rao : నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు
- కాళేశ్వరం కమిషన్ విచారణ పునః ప్రారంభం
- మాజీ మంత్రి హరీష్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
- నేడు కమిషన్ ముందు హజరుకానున్న హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణలో ప్రముఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పునః ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఆయన గతంలో కేసీఆర్ కేబినెట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు హరీష్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు ఫిల్లర్లు కుంగిపోయినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర భూభాగంలో సుమారు 35 శాతం మేరకు సాగునీరు అందుతోందని వివరించారు.
Ponywallahs Revenue: గుర్రాలకు పని లేక.. ఆగిన బతుకు చక్రం..
ఇప్పటికే ఈటల రాజేందర్, గతంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలపై కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు హరీష్ రావు హాజరుకావడం, ఆయన ఏవిధంగా స్పందిస్తారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కమిషన్, కాళేశ్వరం నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు, డిజైన్ దోషాలు, నాణ్యత ప్రమాణాల ఉల్లంఘనలు, ఆర్థిక దుర్వినియోగంపై సుదీర్ఘ విచారణ చేపట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లు తీసుకుని, వాటిని ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.
Also Read
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
ఇంకా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికల ప్రకారం కాంట్రాక్ట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు చెల్లించినట్లు కమిషన్ గుర్తించింది. ఇక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 11న విచారణకు హాజరుకానున్నారు. కమిషన్ విచారణకు స్వయంగా హాజరయ్యేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ ప్రతినిధుల నుంచి వాంగ్మూలాలు సేకరించిన తర్వాత కమిషన్ తన తుది నివేదికను ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
తాజావార్తలు
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?