CM Revanth Reddy : కాళేశ్వరం కూలిన ప్రాజెక్టు కాదు.. గత పాలకుల అపరాధ చరిత్ర
- కాళేశ్వరం వైఫల్యంపై సీఎం రేవంత్ ఆగ్రహం
- సాయిల్ టెస్ట్ లేకుండానే నిర్మాణం
- విపత్తుకు గత ప్రభుత్వం బాధ్యమే : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ సాధనకు ప్రాణంగా నిలిచిన నీళ్ల అవసరమే ఇప్పుడు ప్రజలకు నష్టంగా మారిందని, భావోద్వేగాన్ని రాజకీయంగా వాడుకున్న వారి తప్పిదాలే ఇందుకు కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ వ్యవధిలోనే విఫలమై, కుప్పకూలిన ఘటన భూ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నీటి కోసం మొదలై రాష్ట్రాన్ని సాధించిన ఆవేదనపై ఆయన వివరంగా స్పందించారు. “తెలంగాణ ఉద్యమం ఒక భావోద్వేగం. అది ఉద్యోగాల కోసం కాదు. కానీ, కొన్ని రాజకీయ పార్టీలు ఆ భావోద్వేగాన్ని తమ లబ్దికోసం దుర్వినియోగం చేశాయి,” అని చెప్పారు. ఉద్యమంలో భాగంగా వచ్చిన ఆశయాలను నిర్వీర్యం చేస్తూ, ప్రభుత్వ పాలనను నిర్వాకం చేసిన విధానాలను ఆయన నిందించారు.
Rekha Gupta: కాల్పుల విరమణపై కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
కాళేశ్వరం నిర్మాణ పద్ధతిపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన సీఎం, “ప్రాజెక్టులు ఎలా కట్టకూడదో తెలుసుకోవాలంటే కాళేశ్వరం చూసి నేర్చుకోవాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణానికి కనీస సాయిల్ టెస్ట్ కూడా చేయకుండానే పనులు ప్రారంభించడం ఘోర తప్పిదం,” అన్నారు. కేవలం 80 వేల పుస్తకాలు చదివినంత మాత్రానా ఇంజినీరింగ్ అనుభవం వచ్చినట్టు భావించి తీసుకున్న నిర్ణయాలే ఈ విపత్తుకు కారణమన్నారు. పూర్వ ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కూడా పూర్తిచేయలేకపోయిన ప్రాజెక్టుల పరిస్థితిని గుర్తు చేస్తూ, గత పాలకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు వర్షాలు, వరదలతో ఎంతటి సవాళ్లు ఎదుర్కొన్నా ఇప్పటికీ నిలబడగలుగుతున్నాయి. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కట్టిన మూడు సంవత్సరాల్లోనే కూలిపోయింది. ఇది ప్రజాధనం మీద జరిగిన అతి పెద్ద అపరాధం,” అని మండిపడ్డారు.
Samantha : ఆ డైరెక్టర్ తో క్లోజ్ గా ఫొటో దిగిన సమంత..
అధికారుల వ్యవహారశైలిపై కూడా సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. “నాయకుడు చెప్పినట్టు అధికారులు పని చేస్తే, తర్వాత ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. అప్పటి సీఎం హెలికాప్టర్లో తిరుగుతూ ఎక్కడ ప్రాజెక్టు కట్టాలో నిర్ణయించిన తీరే ఈ రోజు పరిస్థితికి నిదర్శనం. విజిలెన్స్, NDSA నివేదికల ప్రకారం అధికారుల తప్పుడు నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి. తప్పు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం” అన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలోనూ ప్రభుత్వం కట్టుబడినదేనని స్పష్టం చేశారు. గ్రూప్ వన్ పరీక్షల ఏర్పాట్లు పూర్తయ్యాయని, అయితే కొందరి కోర్టు కేసుల వల్ల కొన్ని ఆలస్యాలు జరుగుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ నియామక ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!