Medigadda Barrage : కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ వాయిదా
- హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్.. విచారణ వాయిదా
- మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు.. అవినీతిపై ఆరోపణలు
- నాగవెల్లి రాజలింగమూర్తి హత్య.. కేసు కొత్త మలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావులు, ఇతరుల అవినీతే కారణమని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టులో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా కోర్టు, కేసీఆర్, హరీష్ రావులను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
Sambhaji Maharaj: శంభాజీ మహారాజ్పై వివాదాస్పద కంటెంట్.. వికీపీడియా ఎడిటర్లపై కేసు..
Also Read
- Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ, భూపాలపల్లి కోర్టు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ, కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. విచారణ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాదులు, భూపాలపల్లి కోర్టులో ఫిర్యాదు చేసిన నాగవెల్లి రాజలింగమూర్తి ఇటీవల మృతి చెందినట్టు హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన వ్యక్తిగత హాజరు ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.
మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్, హరీష్ రావులపై భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన రాజలింగమూర్తి ఇటీవల హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి రాజలింగమూర్తిని హత్య చేశారు. ఈ హత్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
-
Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!