Medigadda Barrage : కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ వాయిదా
- హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్.. విచారణ వాయిదా
- మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు.. అవినీతిపై ఆరోపణలు
- నాగవెల్లి రాజలింగమూర్తి హత్య.. కేసు కొత్త మలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావులు, ఇతరుల అవినీతే కారణమని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టులో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా కోర్టు, కేసీఆర్, హరీష్ రావులను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
Sambhaji Maharaj: శంభాజీ మహారాజ్పై వివాదాస్పద కంటెంట్.. వికీపీడియా ఎడిటర్లపై కేసు..
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ, భూపాలపల్లి కోర్టు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ, కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. విచారణ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాదులు, భూపాలపల్లి కోర్టులో ఫిర్యాదు చేసిన నాగవెల్లి రాజలింగమూర్తి ఇటీవల మృతి చెందినట్టు హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన వ్యక్తిగత హాజరు ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.
మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్, హరీష్ రావులపై భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన రాజలింగమూర్తి ఇటీవల హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి రాజలింగమూర్తిని హత్య చేశారు. ఈ హత్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..