Medigadda Barrage : కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ వాయిదా
- హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్.. విచారణ వాయిదా
- మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు.. అవినీతిపై ఆరోపణలు
- నాగవెల్లి రాజలింగమూర్తి హత్య.. కేసు కొత్త మలుపు
Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావులు, ఇతరుల అవినీతే కారణమని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టులో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా కోర్టు, కేసీఆర్, హరీష్ రావులను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
Sambhaji Maharaj: శంభాజీ మహారాజ్పై వివాదాస్పద కంటెంట్.. వికీపీడియా ఎడిటర్లపై కేసు..
Also Read
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ, భూపాలపల్లి కోర్టు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ, కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. విచారణ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాదులు, భూపాలపల్లి కోర్టులో ఫిర్యాదు చేసిన నాగవెల్లి రాజలింగమూర్తి ఇటీవల మృతి చెందినట్టు హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన వ్యక్తిగత హాజరు ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.
మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్, హరీష్ రావులపై భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన రాజలింగమూర్తి ఇటీవల హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి రాజలింగమూర్తిని హత్య చేశారు. ఈ హత్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!