Kadiyam Srihari: బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా?.. ఈ బుద్ది అప్పుడు ఏమైంది?
- బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే కడియం ఫైర్
- వారికి ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా?
- నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో పనిచేస్తున్నా
- తప్పకుండా స్పీకర్కి సమాధానం ఇస్తాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ నేతలపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, అందులో ఇద్దరిని మంత్రులను కూడా చేశారని గుర్తు చేశారు. అప్పటి వారెవరూ రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా? అని విమర్శించారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని, ఈ బుద్ది అప్పుడు ఏమైంది? అని కడియం ప్రశ్నించారు.
వరంగల్ జిల్లా హనుమకొండలోని హరిత హోటల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు తనకు స్పీకర్ ఇచ్చిన నోటీసులపై స్పందించారు. ‘స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా. కాంగ్రెస్తో కలిసి పని చేయడంతోనే మనకు ఇన్ని నిధులు వచ్చాయి. నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంది అంటే.. మొత్తంలో నిధులు తేవడమే కారణం. నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండాయి. కాలువల్లో పూడిక తీయించి మరమ్మతులు చేసి సాగునీరు అందిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సహకారం వల్లే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ప్రగతికి సీఎం అన్ని విధాలుగా అండగా ఉన్నారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తెచ్చిన నిధులపైన నేను కట్టుబడి ఉన్నా’ అని కడియం తెలిపారు.
Also Read
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
Also Read: Ponguleti Biopic: ‘శ్రీనన్న అందరివాడు’.. తెలంగాణ కాంగ్రెస్ మంత్రిపై బయోపిక్!
‘స్టేషన్ ఘన్పూర్ ప్రజలతోనే ఉంటా, ప్రజల కోసమే నిరంతరం కష్టపడతా. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అప్పుడు టీఆర్ఎస్లో చేరిన వారెవరూ రాజీనామా చేయలేదు. మీరు చేర్చుకున్నపుడు ఒక విధానం, వేరే వారు చేర్చుకున్నప్పు ఇంకో విధానంను బీఆర్ఎస్ పాటిస్తుంది. బీఆర్ఎస్ అగ్రనేతలకు ఇప్పుడు విలువలు గుర్తుకొచ్చాయా?. స్పీకర్కి కోర్టు సూచన చేసింది కానీ.. ఆదేశాలు జారీ చేయలేదు. స్పీకర్కి నేను సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం ఉంది. ఒక్కొక్కరి కొంత సమయం ఇచ్చారు, తప్పకుండా స్పీకర్కి సమాధానం ఇస్తాను. నేను పార్టీ మారి పదవి అనుభవించలేదు, నా పని తిరుతోనే పదవి వచ్చింది’ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు.
తాజావార్తలు
-
Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
-
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!