Pune accident: జువైనల్ బోర్డుపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని పూణెలో జరిగిన కారు యాక్సిడెంట్ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మద్యం మత్తులో ఓ బాలుడు డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కొన్ని గంటల్లోనే నిందితుడికి బెయిల్ రావడం.. ప్రమాదంపై న్యాయస్థానం వ్యాసం రాసుకుని రమ్మని చెప్పడం దేశ వ్యాప్తంగా విస్మయానికి గురి చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆందోళనలు వ్యక్తమవ్వడంతో ధర్మాసనం దిగొచ్చి.. నిందితులకు బెయిల్ రద్దు చేసింది. తాజాగా ఈ ఘటనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఇది కూడా చదవండి: Prajwal Revanna: ఇండియాకు రావడానికి ముందే ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్..
Also Read
- GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
- Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
పూణె రోడ్డు ప్రమాదం కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. మద్యం తాగి రోడ్డు ప్రమాదానికి కారణమైన బాలుడికి గంటల్లో బెయిల్ ఇవ్వడంపై విచారణ జరపనున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకొన్న జువైనల్ బోర్డు అధిపతి డాక్టర్ ఎల్ఎన్ దన్వాడే పాత్రపై దర్యాప్తు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Shocking video: ఓ తల్లి క్రూరత్వం.. కన్న బిడ్డను ఏం చేసిందంటే..!
యాక్సిడెంట్ కేసు జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుటకు రాగానే 300 పదాలతో వ్యాసరచన చేయమనడం, 15 గంటలు ట్రాఫిక్ పోలీసులకు సాయం.. తదితర నిబంధనలతో తక్షణమే బెయిల్ ఇచ్చేసింది. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో తిరిగి నిందితుడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు, డాక్టర్లు నిందితుడికి సాయం చేసినట్లు తేలడంతో.. ఇప్పుడు జువైనల్ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపడింది. దీంతో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఇది విచారణ జరిపి వచ్చే వారం మహిళా శిశు అభివృద్ధి శాఖకు నివేదికను సమర్పించనుంది.
ఇది కూడా చదవండి: PM Modi: “నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంలో కుట్ర”.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!