Pulwama Attack: పుల్వామా దాడిపై ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ సంచలన ప్రకటనతో.. భారతీయుడి రక్తం మరిగింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulwama attack: నేటితో పుల్వామా దాడికి సరిగ్గా ఏడేళ్లు. 2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ భయానక దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి అనంతరం.. పాకిస్థాన్కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్థాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్ ఎలాంటి ప్రకటన చేసిందో మీకు గుర్తుందా? ఈ ప్రకటన ఇప్పుడు చదివినా ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది.
READ MORE: IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్.. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ వచ్చేనా..?
Also Read
పుల్వామా దాడి అనంతరం దేశం మొత్తం బాధలో ఉండగా పాకిస్థాన్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. “పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబుదాడి వెనుక మా హస్తం ఉంది.” అని పాక్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఆపరేషన్ సిందూర్ అనంతరం ఔరంగజేబ్ అహ్మద్ లో నిర్వహించిన ప్రెస్మీట్లో చెప్పాడు. దాదాపు ఆరేళ్ల తరువాత పాకిస్థాన్ ఒప్పుకుంది. అప్పటి వరకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన పాకిస్థాన్ ఒక్కసారిగా చేసిన ప్రకటన దేశాన్ని కుదిపేసింది. ప్రతి భారతీయుడి రక్తం మరిగింది. ‘‘పాక్కు చెందిన గగనతలం, భూభాగం, జల సరిహద్దులకు లేదా ప్రజలకు ముప్పుగా పరిణమిస్తే.. వాటిని ఎదుర్కొనేందుకు మేం రాజీ పడబోం. దానిని పట్టించుకోకుండా ఉండలేం.. మా దేశానికి కట్టుబడి ఉంటాం. మా దేశ ప్రజల కీర్తి మొత్తం దళాల్లోనే ఇమిడి ఉండటంతో.. మేము ఎప్పుడూ దానిని నిలబెట్టుకుంటాం. పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడలను చూపించాం. మా కార్యదక్షత.. వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించాం’’ అని డీజీఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి వ్యాఖ్యానించాడు. దీంతో ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలతో పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందన్న విషయం మరోసారి స్పష్టమైంది.
తాజావార్తలు
-
Kerala Congress: కాంగ్రెస్ ఇరకాటం.. కేరళ మరో కర్ణాటక కాబోతోందా.?
-
PEDDI: 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు!
-
Nitish Rana Out: నితీష్ రాణా ఔట్పై వివాదం.. డెడ్ బాల్ ఇవ్వాలా?.. నిబంధనలు ఏమంటున్నాయి?
-
Vijay-Governor: గవర్నర్ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Akhilesh Yadav: ఐప్యాక్తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!