PM Modi: “నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంలో కుట్ర”.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఒడిశా అసెంబ్లీతో పాటు అధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బీజేపీ నేతలు బిజూ జనతాదళ్(బీజేడీ) చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు ఒడిశాలోని బరిపాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనుక కుట్ర ఉందని అన్నారు. తాము నవీన్ పట్నాయక్ మెడికల్ హిస్టరీపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
‘‘నవీన్ పట్నాయక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం వెనుక కుట్ర దాగి ఉందా? ప్రస్తుతం ఆయన తరపున పట్నాయక్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు అతని ఆరోగ్యం అకాస్మాత్తుగా క్షీణించడానికి కారణమా..?’’ అని ప్రధాని ప్రశ్నించారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి గత కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారు.
Also Read
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
Read Also: Karthikeya: ఖైదీ టైపులో ఊహించుకున్నా.. తెలుగులో విలన్ ఆఫర్స్ : కార్తికేయ ఇంటర్వ్యూ
ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత వీకే పాండియన్ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తు్న్నారు. బీజేపీకి ఓటేస్తే ఒడిశాకు చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని, తమిళనాడు బాబునున కాదంటూ గత వారం అమిత్ షా అన్నారు.
ఒడిశాలోని 21 లోక్సభ స్థానాలతో పాటు 147 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేడీ, బీజేపీ రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 08 స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేడీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 16.9 శాతం పెరిగింది.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!