PM Modi: “నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంలో కుట్ర”.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఒడిశా అసెంబ్లీతో పాటు అధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బీజేపీ నేతలు బిజూ జనతాదళ్(బీజేడీ) చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు ఒడిశాలోని బరిపాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనుక కుట్ర ఉందని అన్నారు. తాము నవీన్ పట్నాయక్ మెడికల్ హిస్టరీపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
‘‘నవీన్ పట్నాయక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం వెనుక కుట్ర దాగి ఉందా? ప్రస్తుతం ఆయన తరపున పట్నాయక్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు అతని ఆరోగ్యం అకాస్మాత్తుగా క్షీణించడానికి కారణమా..?’’ అని ప్రధాని ప్రశ్నించారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి గత కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Karthikeya: ఖైదీ టైపులో ఊహించుకున్నా.. తెలుగులో విలన్ ఆఫర్స్ : కార్తికేయ ఇంటర్వ్యూ
ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత వీకే పాండియన్ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తు్న్నారు. బీజేపీకి ఓటేస్తే ఒడిశాకు చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని, తమిళనాడు బాబునున కాదంటూ గత వారం అమిత్ షా అన్నారు.
ఒడిశాలోని 21 లోక్సభ స్థానాలతో పాటు 147 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేడీ, బీజేపీ రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 08 స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేడీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 16.9 శాతం పెరిగింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!