Lok Sabha Election 2024: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ఓటేయలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: భారత దేశంలో ఈరోజు చివర దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదిలావుండగా, 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక, ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీన భారత దేశానికి పరివర్తన చెందిన క్షణం అని కాంగ్రెస్ నాయకుడు అభివర్ణించారు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ దేశంలో I.N.D.I.A కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. ఓటర్ల దృఢ సంకల్పంతో ఎండవేడిమిలో కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మీరంతా ఓటు వేయడానికి ముందుకు వచ్చారన్నారు. పౌరులు నిర్ణయాత్మకంగా ఓటు వేయాలని కోరారు. ఇక, జూన్ 4వ తేదీ నాటికి సూర్యుడు దేశానికి కొత్త ఉదయాన్ని తీసుకు వస్తాడని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.
Read Also: Amit Shah: కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని ప్రచారం చేసింది.. ఎందుకు దూరంగా ఉంటున్నారు..?
Also Read
- Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
కాగా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. అలాగే ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి దేశంలో లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటి వరకు ఆరు దశల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగిందని ప్రియాంక తెలిపారు.
Read Also: Power Cuts: గమనిక.. నేడు హైదరాబాద్ లో పవర్ కట్..
ఇక, చివరి దశ ఎన్నికలలో భాగంగా నేడు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలితంలో పోలింగ్ కొనసాగుతుంది. బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్లో ఓటింగ్ జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలోని మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఏకకాలంలో ఓటింగ్ జరుగుతుంది. చివరి దశ ఓటింగ్లో మొత్తం 904 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
प्यारे देशवासियों!
आज सातवें और अंतिम चरण का मतदान है और अब तक के रुझानों से स्पष्ट है कि देश में INDIA की सरकार बनने जा रही है।
मुझे गर्व है कि झुलसा देने वाली गर्मी में भी आप सभी लोकतंत्र और संविधान की रक्षा के लिए वोट देने निकले हैं।
आज भी बड़ी संख्या में बाहर निकल कर…
— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2024
తాజావార్తలు
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?