Lok Sabha Election 2024: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ఓటేయలి..!
INDIA bloc: భారత దేశంలో ఈరోజు చివర దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదిలావుండగా, 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక, ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీన భారత దేశానికి పరివర్తన చెందిన క్షణం అని కాంగ్రెస్ నాయకుడు అభివర్ణించారు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ దేశంలో I.N.D.I.A కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. ఓటర్ల దృఢ సంకల్పంతో ఎండవేడిమిలో కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మీరంతా ఓటు వేయడానికి ముందుకు వచ్చారన్నారు. పౌరులు నిర్ణయాత్మకంగా ఓటు వేయాలని కోరారు. ఇక, జూన్ 4వ తేదీ నాటికి సూర్యుడు దేశానికి కొత్త ఉదయాన్ని తీసుకు వస్తాడని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.
Read Also: Amit Shah: కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని ప్రచారం చేసింది.. ఎందుకు దూరంగా ఉంటున్నారు..?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
కాగా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. అలాగే ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి దేశంలో లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటి వరకు ఆరు దశల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగిందని ప్రియాంక తెలిపారు.
Read Also: Power Cuts: గమనిక.. నేడు హైదరాబాద్ లో పవర్ కట్..
ఇక, చివరి దశ ఎన్నికలలో భాగంగా నేడు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలితంలో పోలింగ్ కొనసాగుతుంది. బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్లో ఓటింగ్ జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలోని మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఏకకాలంలో ఓటింగ్ జరుగుతుంది. చివరి దశ ఓటింగ్లో మొత్తం 904 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
प्यारे देशवासियों!
आज सातवें और अंतिम चरण का मतदान है और अब तक के रुझानों से स्पष्ट है कि देश में INDIA की सरकार बनने जा रही है।
मुझे गर्व है कि झुलसा देने वाली गर्मी में भी आप सभी लोकतंत्र और संविधान की रक्षा के लिए वोट देने निकले हैं।
आज भी बड़ी संख्या में बाहर निकल कर…
— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో