Amit Shah: కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని ప్రచారం చేసింది.. ఎందుకు దూరంగా ఉంటున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి హస్తం పార్టీ తిరస్కరణకు గురవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపింది.. కానీ ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించి.. ఎగ్జిట్ పోల్స్లో ఓటమిని ఎదుర్కొంటుందని తెలుసుకుందన్నారు. ఎగ్జిట్ పోల్ అంచనాలపై మీడియా అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ దగ్గర ఆన్సర్స్ లేకపోవడం వల్లే చర్చలకు దూరంగా ఉందని అమిత్ షా ఎద్దేవా చేశారు.
Read Also: Music Shop Murthy : ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’… ఆకట్టుకుంటున్న ట్రైలర్..
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ఇక, న్యాయపరమైన తీర్పులు, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేనప్పుడు సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని అమిత్ షా తెలిపారు. బీజేపీ అనేక సార్లు ఓడిపోయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ను ఏనాడూ బహిష్కరించలేదన్నారు. ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించే అవకాశం ఉందన్నారు. కాగా, టీవీ చానెళ్లలో జరిగే ఎగ్జిట్ పోల్ చర్చల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనకూడదని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నేటి (శనివారం) సాయంత్రం ఏడో దశ ఎన్నికలు ముగిసిన అనంతరం వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ను 6. 30గంటలకు విడుదల చేయనున్నాయి.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?