J. P. Nadda: తెలంగాణలో కేసీఆర్ 5G నడుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి చేయడం కంటే అప్పుల కూపీలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ దోపిడీ తెలంగాణలో సాగుతుందని.. కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ అంటున్నారని.. బీజేపీ అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పారు.
Jammu Kashmir: రాజౌరీ ఎన్కౌంటర్.. ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ముగ్గురు జవాన్ల వీరమరణం..
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పై నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి అని విమర్శించారు. ధరణితో పేదల భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కి ఏటీఎంగా మారిందని.. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు లక్ష కోట్ల వ్యయం పెరిగిందని చెప్పారు. అంతేకాకుండా.. మియాపూర్ భూముల్లో అవకతవకలు జరిగాయని నడ్డా ఆరోపించారు. ఓటర్ రింగ్ రోడ్డులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్ళని జైల్లో వెయ్యలా వద్దా అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. ప్రధాని అవాస్ యోజన కింద 20 వేల ఇల్లు ఇస్తే… డబుల్ బెడ్ రూమ్ స్కీంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ 5G నడుస్తుందని దుయ్యబట్టారు. ఇలాంటి రౌడీ రాజ్యాన్ని దోచుకునే రాజ్యాన్ని కొనసాగిద్దామా అని ప్రశ్నించారు.
Chandrababu: చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
మహిళలకు ఆర్థిక స్వాలంబన లభించాలంటే బీజేపీకి ఓటేయండి జేపీ నడ్డా తెలిపారు. మన మధ్య ఉన్న బేధాలను పక్కకు పెట్టి పార్టీ గెలుపు కోసం పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని అధికారంలోకి మళ్ళీ వస్తే రెండేళ్లలో మూడో స్థానంలో వస్తుందని చెప్పారు. గత పదేళ్ళలో కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చామని.. అన్ని వర్గాలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే నవంబర్ 30న కమలం పువ్వు గుర్తుకు ఓటెయ్యండని సూచించారు. తెలంగాణలో 26 లక్షల బీద కుటుంబాలకు 5 లక్షల ఆరోగ్య భీమా ఇస్తామని చెప్పారు. 38 లక్షల కుటుంబాలకు తాగు నీరు ఇస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని నడ్డా పేర్కొన్నారు.
- Tags
- bjp
- BRS
- Election Campaign
- jp nadda
- kcr
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!