Jogi Ramesh : పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతుండటం ఒక చరిత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా వెంకటపాలెంలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు జోగి రమేష్, విడదల రజని. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతుండటం ఒక చరిత్ర అని ఆయన కొనియాడారు. పేదలకు ఇళ్లు కట్టకూడదని పెత్తందార్లు ఒకవైపు… పేదలకు ఇళ్లు కట్టిచూపిస్తానని పేదల పక్షాన సీఎం జగన్ అని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్ పేదల ఇళ్లకు అడ్డుపడ్డారని, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ ప్రాంతానికి వచ్చి ఇళ్ళు కట్టుకోవడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. పెత్తందార్ల పక్షాన చంద్రబాబు సుప్రీంకోర్టు వరకూ వెళ్లాడని, పెత్తందార్ల కోటలను బద్ధలుకొడుతున్నామని సగర్వంగా చెబుతున్నామన్నారు జోగి రమేష్. 50వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టిస్తున్నామని గర్వంగా చెబుతున్నామని, ఆరు నెలల్లో ఇళ్లు పూర్తి చేయబోతున్నామన్నారు.
Also Read : Kethika Sharma : బిగుతైనా అందాలతో రెచ్చగొడుతున్న కేతిక శర్మ..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
గృహప్రవేశాలు చేసి జయహో జగనన్న నినాదాలతో ఈ ప్రాంతం మారుమోగేలా చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం.. మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. పేదల ఇళ్లను అడ్డుకున్నవారికి ఇదొక కనువిప్పు అన్నారు. చంద్రబాబు ఎక్కడలేని చట్టాలను తీసుకొచ్చి మంచిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు విడదల రజిని. పేదలకు మంచి చేయాలనే తపన సీఎం జగన్ ది అని, చంద్రబాబు పేదల వ్యతిరేకిగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాడని, పేదల పక్షపాతిగా సీఎం జగన్ ప్రజల మనసులో నిలిచిపోతారని ఆమె అన్నారు.
Also Read : Hyderabad Gold Idli: హైదరాబాద్లో గోల్డ్ ఇడ్లీ..! ఇప్పుడిదే ట్రెండింగ్..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!